Pages

Sunday, December 6, 2009

అసుర సంధ్య - 5

వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ పరిసరాలని గమనించడంలో మునిగిపోయారు. లీ, జేమ్స్ ఇద్దరికీ ఇంటరెస్టింగ్ గానే ఉన్న, అక్కడ వాళ్ళు ఎం చెయ్యడానికి లేక పోవడం తో కొంచెం ముందుకి వెళ్దామని బయలుదేరారు. వివేక్ ఆలేఖ్య కొంచెం సేపు అక్కడి పరిసరాలని చూసాక, అక్కడి బొమ్మలని పరిశీలించాక ఒక నిర్ధారణ కి వచ్చారు. అది ఒక ప్రయోగ శాల. అక్కడ ఆ దీవి సంరక్షకుడు అయిన మాంత్రికుడు రక రకాల ప్రయోగాలు చేసేవాడు. రకరకాల పొడులు, మూలికలు తాయారు చేసేవాడు. సాధారణంగా అవి వాడడం రాని వాళ్ళు వాడితే వికటిస్తాయి. అందుకని అలంటి వాటిని జాగ్రత్తగా మరో చోట దాచిపెడతారు. ఇది సాధారణంగా నేటి రీసెర్చ్ ల్యాబ్స్ లో కూడా అదే పధ్ధతి అనుసరిస్తారు. లాబ్లో తాయారు అయిన వాటిని ప్రత్యేకమైన వాల్ట్ లో పెడతారు. అక్కడికి చాల తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే ఉంటుంది. జాగ్రత్తగా వెతికితే ఏంటో శక్తివంతమైన మిశ్రమాలు దొరికే అవకాశం ఉంది. వివేక్ ఆలేఖ్య అక్కడ చుట్టుపక్కల అంతా వెతికారు కానీ వాళ్ళకి అలంటి సదుపాయం ఏమి కనిపించలేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాలేచ్ట్ చేసుకున్నాక లీ జేమ్స్ ఎక్కడ ఉన్నారో అని బయలుదేరారు. వాళ్ళు బయలుదేరారో లేదో పెద్ద ఆర్తనాదం ఒకటి వినిపించింది. అది లీ గొంతులా ఉంది. వెంటనే వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ అరుపు వినిపించిన వైపు పరుగెత్తారు. అక్కడికి కొంచెం ముందుకు వెళ్తే గోడలోకి తొలిచిన చిన్న కన్నం ఉంది. ఆ కన్నం కేవలం మూడు అడుగుల వెడల్పు అంటే పొడవులో ఉంది. లీ అరుపులు వినపడక పోతే ఆ కన్నాన్ని గమనించే వాళ్ళు కాదు. చెట్టు తోర్రలాంటి ఆ కన్నంలోంచి వివేక్ తల పెట్టి చూసాడు. లోపల లీ నెల మీద పడి దొర్లుతున్నాడు.నెమ్మదిగా వివేక ఆ కన్నంలోంచి అవతలికి దూరి జేమ్స్ దగ్గరికి వెళ్ళాడు. జేమ్స్ అప్పటికే లీ కి ఏమయ్యిందో పరిక్షుస్తున్నాడు. "లీ కి ఏమయింది జేమ్స్? ఎందుకలా పడిపోయాడు?"
"నేను, లీ నడుస్తుంటే లీ ఒక రాయి మీద చెయ్యి వెయ్యగానే ఈ తొర్ర ప్రత్యక్షమయింది. లీ నేను అతి కష్టం మీద లోపలకి వచము. నేను ఒక వైపు లీ ఒక వైపు గోడలని పరిక్షిస్తున్నాము ఇంతలొ ఏమయిందో ఏమో లీ ఉన్నట్టుండి గట్టిగ అరిచి పడిపోయాడు. బహుశ స్పృహలో లేడు అనుకుంటా. ఇతన్ని వెంటనే బయటకి తీసుకువెళ్ళాలి. ఫ్రెష్ ఎయిర్ చాల అవసరం. కొద్దిగా హెల్ప్ చెయ్యి." ఇద్దరు కస్టపడి ఎలాగో అలాగా లీ ని గుహ బయటకి తీసుకువచ్చారు. వెనకాలే ఆలేఖ్య కూడా వచ్చింది. గుహ బయటకి రాగానే, లీ మొహం చూడగానే జేమ్స్ కి అర్ధం అయ్యింది. లీ మొహం అంతా చీమలు కుట్టినట్టు ఎర్రగా కందిపోయి దద్దుర్లు దద్దుర్లు గ ఉంది. లీ అక్కడ గుహ లో ఉన్నప్పుడు ఏదో పురుగుని ముట్టుకున్నట్టు ఉన్నాడు. మొహం అంతా ఉబ్బిపోయి వికారంగా తయారయింది. వెంటనే జేమ్స్ చుట్టూ చూసి ఏవో పొద నించి కొన్ని ఆకులు తెంపి అరచేతులతో నూరి ఆ రసం లీ మొహం మీద పడేటట్టు గ పిండాడు. కొంచెం సేపటికి లీ కి మెలకువ వచ్చింది.అందరు ఆదుర్దా గ తననే చూస్తున్నారు."ఏమయింది ! అలా ఎందుకు అరిచావు? " అడిగాడు జేమ్స్. "నేను గోడలని తడుముతూ ఉండగా చిన్న అర లాంటిది చేతికి తగిలింది. అందులో ఏముందో అని వేలు కొంచెం లోపలి పెట్టగానే ఏదో గ్యాస్ లాగా వచ్చింది. తరవాత ఏమయ్యిందో నాకు తెలిదు" . "ఎస్. అక్కడ బంగారం కన్నా విలువ అయింది ఏదో ఉంది. అందుకే బంగారాన్ని గాలికి వదిలేసి దీన్ని మాత్రం చాల పకడ్బందీగా దాచిపెట్టారు." అన్నాడు వివేక. "మనం మొదట వెళ్ళిన గది ఒక లాబొరేటరి. అక్కడ రక రకాల ప్రయోగాలు చేసి ఉంటారు. ఆ కెమికల్స్ అన్ని ఎక్కడో దాచి ఉంటారు. బహుశ నీకు తగిలింది ఆ గదికి సంబంధించిన తాళం అయి ఉంటుంది. ఆ గది తెరవడం వల్ల మనుషులందరికీ పనికి వచ్చే ఎన్నో మందులు బయటపడొచ్చు." అంది ఆలేఖ్య. అందరు సాలోచనగా చూసారు. ఆలేఖ్య చెప్పింది నిజమే. కొన్ని ఆటవిక తెగలలో చనిపోయిన వారి తలకాయలని ఒక రకమైన ఆకు పసరులో నానబెట్టి దాన్ని నిప్పుల మీద కాల్చితే తలకాయ పిడికిలి సైజులోకి కుదించుకుపోతుంది. అలంటి తలలు చాల లభించాయి. ఆ ఆకు పసరు ఫార్ములా తెలుసుకో గలిగితే ట్యూమర్ తగ్గించడానికి అత్యంత బాధాకరమైన కేమో థెరపీ లేకుండానే తగ్గించవచ్చు. ఒక డాక్టర్ గ జేమ్స్ కి ఈ సంగతి తెలుసు. ఎన్నో నాగరికతల్ని చదివిన వివేక, ఆలేఖ్యలకి కూడా ఈ సంగతి తెలుసు. కాని వీళ్ళ అందరికి తట్టని విషయం ఇంకోటి ఉంది. విజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచికి ఉపయోగ పడినట్టే చెడుకి కూడా ఉపయోగ పడుతుంది. బహుశ ఆ సంగతి గ్రహించి బాధ పడ్డ మొదటి వ్యక్తీ ఐన్ స్టీన్ అనుకుంటా. ఆటం బాంబ్ కనిపెట్టడం వల్ల జరిగిన ప్రళయం చూసాక ఎంతో మానసిక వ్యధకి గురి అయ్యుంటాడు.

లీ కొద్దిగా తేరుకున్నాడు. మొహం మాములుగు అయ్యింది కాని ఇంకా క్నోచ్మే నలతగానే కనిపిస్తున్నాడు. లీ ని ఖాలీ ప్రదేశంలో కూర్చోబెట్టి జేమ్స్ వివేక్ ఏవో పళ్ళు తీసుకుని వచ్చారు తినటానికి. ఆలేఖ్య గుహ లో చూసిన సంఘటనల గురించి ఆలోచిస్తోంది. అందరు పళ్ళు తినేసాక, ఆల్కేహ్య చుట్టూ చూస్తె "గ్రెగ్ క్రిస్టినా వెళ్లి చాల సేపు అయ్యింది. ఇద్దరు ఏమి చేస్తున్నారో ఏమో?" అంది. జేమ్స్ భావ రహితంగా ఒక చూపు చూసి ఊరుకున్నాడు. అది గమనించి వివేక్ ఏదో అన బోయి ఆగిపోయాడు. ఆల్కేహ్య కి గుహలోకి వెళ్ళే ముందు జరిగినఆర్గుమెంట్ గుర్తు వచ్చింది.
"నాయర్ ఎలా చనిపోయాడో మనకి కొద్దిగా అర్థం అయ్యింది. కానీ మనం వెళ్ళిన చోటికి కాకుండా నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. లీ తో పటు మనం ఇద్దరం ఉండబట్టి సరిపోయింది లేక పోతే లీ ఆ కన్నం లోంచి బయట పడేవాడు కాదు. నాయర్ ని రక్షించడానికి ఎవ్వరు లేరు కనక నాయర్ కూడా అదే చోటికి వెళ్ళాడు అనుకోవడానికి లేదు. ఒక వేల లీ స్థానం లో నాయర్ ఉంది ఉంటె అక్కడికక్కడే చనిపోయేవాడు. నాయర్ తనంతట తను తిరిగి బయటకి నడుచుకుంట రాగలిగాడు అంటే నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. మనం ఎక్కువ రోజులు ఈ దీవిలో ఉండడం అంత మంచిది కాదు. రేపటి నించి ఈ గుహ దగ్గర కక్కుండా మనం సముద్రం దగ్గర ఎక్కువ సమయం గడుపుదాం. మనల్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకోసం ఎదురు చూడం తప్ప్ప ఇలా చావుని వెతుక్కుంటూ మనం వెళ్లొద్దు. టైం కలిసి వస్తే బంగారాన్ని అందర్మ తీసుకుని వెళ్ళొచ్చు." అన్నాడు జేమ్స్.
అది కరెక్ట్ అనిపించింది అందరికి. వీలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గ్రెగ్ క్రిస్టినా తిరిగి వచ్చారు. వాళ్ళని చూడగనే మిగిలిన వాళ్ళందరికీ ఏదో జరిగింది అని అర్థం అయ్యినిడ్. క్రిస్టినా మోహంలో ఏదో తెలియని ఆత్రుత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎం జరిగిందో అడుగుదామని ఆలేఖ్య నోరు తెరవబోతుంటే జేమ్స్ కళ్ళతోనే వారించాడు. గ్రెగ్ లీ ని చూడగానే “ఎం జరిగింది ! లీ అలా ఉన్నాడేమిటి?" అని అడిగాడు. వివేక్ జరిగింది చెప్పాడు. అంట విని గ్రెగ్ "మనకి తెలియని రహస్యాలు ఈ గుహ లో చాల ఉన్నట్టు ఉన్నాయి. మనం అంతా మరో సారి ఆ గుహలోకి వెళ్ళడం మంచిదేమో. మన ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు” అన్నాడు గ్రెగ్. అంతా అతని వంక విచిత్రంగా చూసారు. కేవలం కొన్ని గంటల ముందు అనవసరంగా మన ప్రాణాలు రిస్క్ చెయ్యడం ఎందుకు అని అడిగిన మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాదేమిత అని అందరికన్నా మొదట అనుమానం వచ్చింది జేమ్స్ కి. వయసు నేర్పిన అనుభవం వల్ల జేమ్స్ అప్పుడేమి మాట్లాడలేదు. మాట్లాడి ఉంటె అక్కడ గ్రెగ్ చేతిలో ఎన్ని ప్రాణాలు పోయేవో?
జేమ్స్ అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతున్నాయి. కొన్ని గంటల ముందు మాట్లాడినదానికి పూర్తీ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏదో మారింది. గ్రెగ్ క్రిస్టినా ఇద్దరు తిరిగి వచినప్పటి నించి క్రిస్టినా అదోలా ఉంది. ఎందుకో మాటిమాటికి గ్రెగ్ ని వెతుక్కుంటోంది. ఎక్కడికో వదిలి వెళ్ళిపోతాడు అన్న భావన కనిపిస్తోంది తన కళ్ళలో. చుట్టూ సముద్రం తప్ప ఏమి లేని దీవిలోంచి తప్పించుకోవాలి అంటే రెండే రెండు మార్గాలు. ఒకటి ఈదుకుంటూ వెళ్ళడం. రెండు ఏదన్న పడవ ఎక్కి వెళ్ళడం. మొదటిది అసంభవం కనక గ్రెగ్ కి ఏదన్న పడవ దొరికిందా? అయితే ఆ సంగతి అందరికి చెప్పలేదేందుకు?
సమాధానం తెలియని ఈ ప్రశ్నలనించి మనసుని డైవర్ట్ చెయ్యడానికి తల గట్టిగ విదిలించాడు జేమ్స్. అప్పటికి గాని గ్రెగ్ తననే అబ్జర్వ్ చేస్తున్న సంగతి గమనించలేదు. గమనించగానే జేమ్స్ వళ్ళు జలదరించింది. ఆ చూపులు కుందేలు మీద పంజా విసిరే సింహం చూపులా చాల నిర్లిప్తంగా ఉంది.

ఆ తరవాత చాల సేపటికి గాని జేమ్స్ ఆ చూపులని మర్చిపోలేకపోయాడు. ఆ రాత్రి అంతా కూడా జేమ్స్ కి నిద్ర పట్టలేదు. ఏ చిన్న చప్పుడు అయిన చటుక్కున లేచి కూర్చుంటున్నాడు. అలా కొంత సేపు అయ్యాక, జేమ్స్ ఇంక ఉండబట్టలేక, చల్ల గాలికి తిరిగితే అయినా కొంచెం నిద్ర పడుతుందేమో అన్న ఆలోచనతో లేచి ఇవతలికి వచ్చాడు. అలా వస్తుండగా గుహలోంచి వినిపించింది ఒక పెద్ద అరుపు. ఆ అరుపు మాములుగా లేదు. ఏదో అడవి జంతువు ఆకలితో అలమటిస్తున్న అరుపుల ఉంది. వాళ్ళు ఆ దీవిమీదకి వచ్చి అప్పటికే సుమారుగా వారం అయిఉంటుంది. వాళ్లకి ఎక్కడ పెద్ద జంతువులు కనిపించలేదు. ఆ అరుపు చాల వికృతంగా ఉంది. జేమ్స్ కి తెలిసినంత వరకు అటువంటి అరుపు ఎప్పుడు విని ఉండలేదు. ఆ అరుపుకి మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా లేచి వచ్చారు.
లీ వస్తూనే "గ్రెగ్, క్రిస్టినా ఏరి?" అని అడిగాడు.
అప్పటి వరకు అక్కడ గ్రెగ్, క్రిస్టినా లేరు అన్న సంగతి జేమ్స్ కి గాని, ఆలేఖ్య వివేక్ కి కానీ స్ఫురించలేదు. ఇంతలో గుహలోంచి మళ్ళి ఆ అరుపు వినిపించింది. ఆ అరుపు వెనకే మరో గొంతు వినిపించింది.
"అది క్రిస్టినా గొంతు" అంది ఆలేఖ్య.
వెంటనే గుహ లోకి లీ, వివేక్ సంధించి వదిలిన బాణంలా పరుగు తీసారు. వెళ్తూ వెళ్తూ లీ రెండు ఎండు కొమ్మలు విరిచి వివేక్ కి ఒకటి ఇచ్చి తను ఒకటి పట్టుకున్నాడు. వెనకాలే జేమ్స్, ఆలేఖ్య అందుబాటులో ఉన్న రాళ్ళు తీసుకుని పరిగెత్తారు. గుహలోకి వెళ్ళాక అరుపులు మరింత ఎక్కువ అవ్వసాగాయి. నలుగురు అరుపులు వినిపిస్తున్న దిశలోకి పరుగెత్తారు. ఆ దారి మలుపులు తిరుగుతూ వీళ్ళు కూడా పరుగు తీసారు. ఒక మలుపులో ఉన్న రాయిని తప్పించుకోబోయి లీ బోర్ల పడిపోయాడు. ఆ వెనకాలే వస్తున్నా వివేక్ లీ ని లేపుదామని కిందకి వంగినవాడు అలానే స్థాణువులా ఉండిపోయాడు. కొంచెం ఆలస్యంగా అక్కడికి వచ్చిన ఆలేఖ్య, జేమ్స్ కూడా వివేక్ చూస్తున్న వైపు చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసుకుపోయారు. అక్కడ ఏముందా అనుకుంటూ అటు వైపు చూసిన లీ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అక్కడ సుమారుగా పది అడుగుల ఎత్తు ఉన్న జంతువు ఏదో ఉంది. మొసలిని పోలిన ఆ జంతువు ఒళ్ళంతా పొలుసులు పొలుసులుగ ఉంది. వీపు మీద అర చెయ్యి అంతా మొప్పులు తల నించి నడుము దాక ఉన్నాయి. ఆ జంతువు కోరలు పది అంగుళాల పొడవు ఉన్నాయి. నోటి నించి లాలాజలం కారుతూ చూడడానికి చాల అసహ్యంగ భయంకరంగా ఉంది. ఆ జంతువు తన ఎర్రటి కళ్ళతో ఎదురుగ ఉన్న క్రిస్టినా వంకే చూస్తుంది. రక్తం ఓడుతున్న చేతులతో క్రిస్టినాని పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తోంది. ఆ దృశ్యం చూడగానే నలుగురు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ జంతువు మీద ఎదురుదాడి ప్రారంభించారు. అప్పటి దాక క్రిస్టినా మీద దాడి చేస్తున్న ఆ జంతువు సడెన్గా ఎదురయిన ప్రతిఘటనకి బిత్తరపోయింది. క్రిస్టినాని పట్టుకునే ప్రయత్నం విరమించుకుని గుహ లోపలి పరుగెత్తుకుంటూ అక్కడున్న చీకటి సందుల్లో దూరి మాయం అయిపొయింది.
"ఏమయ్యింది? ఇంత రాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావ్? అసలు ఆ జంతువు ఏంటి? ఎక్కడి నించి వచ్చింది?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది ఆలేఖ్య. ఇంక భయంతో బిగుసుకుపోయిన క్రిస్టినా ని నెమ్మదిగా బయటికి తీసుకు వచ్చారు. బయటికి వచ్చిన కొంత సేపటికి క్రిస్టినా షాక్ నించి తేరుకుంది. నెమ్మదిగా ఆ రోజు మధ్యాహ్నం నించి జరిగిన సంగతులు చెప్పడం మొదలు పెట్టింది:

పడవని పొదల మాటున దాచేసి చేతులు దులుపుకుంటూ ఇవతలికి వచ్చాడు గ్రెగ్. అదంతా అవ్వడానికి సుమారుగా అరగంట పైనే పట్టింది. గ్రెగ్ చంపి సముద్రంలో విసిరేసిన శవాల జాడ కనిపెట్టినట్టున్నాయి చేపల మీద బతికే కొన్ని సముద్రపు పక్షులు. నెమ్మదిగా గుంపులు గుంపులుగా శవాల మీద వాలి దొరికినంత ముక్క ముక్కున కరుచుకుని గూటిలో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాయి. వాటినే చూస్తున్న క్రిస్టినా కి మాంసపు ముద్దలా మీద వాలుతున్న ఆ పక్షులకి మనుషులకి పెద్ద తేడా కనిపించలేదు. మనిషి కూడా అంతే. దొరికిన వాటిని దొరికినట్టు తన పరివారానికి మొత్తం అందేలా దాచేస్తాడు. కాకపోతే ఇక్కడ మనుషులకి పక్షులకి కొంచెం తేడా ఉంది. మనిషి తన స్వార్ధానికి తోటి మనిషిని చంపి అయినా తను లాభం పొందుతాడు. పక్షులు అలా కాదు. కనీసం తమ జాతి పక్షులని స్వార్థానికి చంపవు. ఇలా సాగుతున్నాయి క్రిస్టినా ఆలోచనలు. ఇంతలో గ్రెగ్ వస్తున్న అలికిడికి అటు వైపు తిరిగింది.
"ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు.
"ఇంతకీ పడవని ఎందుకు దాచేసావ్? అందరం కలిసి వెళ్లిపోవచ్చు కదా!" అంది.
"ఆ పడవ బయట అలానే ఉంచేస్తే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళకి ఈజీగా దొరికిపోతాం. అప్పుడు వాళ్ళు మనకి పోటి వస్తారు. బంగారం లో మనకి వచ్చే షేర్ తగ్గిపోతుంది" అన్నాడు.
"నీ ప్లాన్ ఏంటి? అంత బంగారాన్ని ఎప్పుడు ఎలా తీసుకువద్దాం?" అడిగింది క్రిస్టినా.
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. అందరు పడుకున్నప్పుడు నెమ్మదిగా మనం ఇద్దరం గుహ లోకి వెళ్లి నెమ్మది నెమ్మది గా మోయ్యగలిగినన్ని తీసుకుని వచ్చేద్దాం. ఈరోజు మనం చెయ్యాల్సిన పనులు చాల ఉన్నాయి. పద! అడివిలోకి వెళ్లి మనకి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుందాం" అన్నాడు.
వడివడిగా అడుగులు వేసుకుంటూ సముద్రపు ఒడ్డున పడి ఉన్న సామాన్లలోంచి కొంచెం పెద్దగ, బలంగా ఉన్న సూట్ కేస్లు రెండు పట్టుకు వచ్చాడు. అలానే అడివిలోకి వెళ్లి బలంగా ఉన్న రెండు మూడు కొమ్మలని విరిచి, వాటి మొదల్లని పదునుగా చెక్కాడు. అవి ఈటేల్లాగా ఉన్నాయి.
వాటిని చూడగానే క్రిస్టినా భయంగా "అవి ఎందుకు. మనం బంగారం మోసుకు రావడానికి సూట్ కేస్లు ఉన్నాయి కదా. మళ్ళి ఇవి ఎందుకు?"
క్రిస్టినా ప్రశ్న కి బదులు చెప్పకుండా, గ్రెగ్ ఆ సూట్ కేస్లని మిగలిన వాళ్ళ కంట బడకుండా గుహ దగ్గరికి చేర్చాడు. చేర్చి ఇద్దరు కలిసి మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు.
గ్రెగ్ కి మిగలిన వాళ్లకి వాటా ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే లీ కి జరిగిన సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకుందామని ప్రయత్నించాడు. అందరిని గుహ లోకి వెళ్దాము అని ప్రోత్సహించాడు.
లీ కి జరిగినట్టే మిగిలిన వాళ్ళకి కూడా ఏదన్న ప్రమాదం జరిగి వాళ్ళంతట వాళ్ళు చనిపోతారేమో అనుకున్నాడు. కాక పోతే జేమ్స్ ప్రవర్తనలో ఏదో మార్పు గమనించి ఆగిపోయాడు.
అందరు పడుకున్నాక, గ్రెగ్ క్రిస్టినాని నెమ్మదిగా తట్టి లేపాడు. ఇద్దరు కలిసి నెమ్మదిగా గుహలోకి వెళ్లారు. బంగారం ఉన్న చోటికి వెళ్తుండగా గ్రెగ్ కి ఏదో అలికిడి వినిపించి అటు వైపు కాకుండా మరో వైపు దారి తీసాడు.
అలా కొంచెం ముందుకి వెళ్ళాక, అక్కడ కొన్ని విగ్రహాలు కనిపించాయి. వాటిలోంచి శబ్దాలు వస్తున్నాయి.
క్రిస్టినా కొంచెం భయం భయం గా "గ్రెగ్! మనం వెల్లిపోదాం. నాకెందుకో భయంగా ఉంది. విగ్రహాలలోంచి శబ్దాలు వస్తున్నాయి. ప్లీజ్ నా మాట విను వెళ్లి పోదాం" అంది
"అదేం లేదు నువ్వు ధైర్యంగా ఉండు. బహుశ ఇది మనం మొదటి రోజు నించి వింటున్న శబ్దాలేమో. గాలి చేస్తున్న శబ్దాలు అని భ్రమించాం. ఈ సంగతేంటో తెల్చేస్తాను చూడు " అన్నాడు.
ఆ విగ్రహాన్ని పరీక్షిస్తూ విగ్రహం పక్కన ఉన్న ఒక రాయిని కదిపాడు. ఆ రాయి కదలడం, విగ్రహం ప్రాణమున్న జంతువుల మారడం ఒకేసారి జరిగాయి. ఆ జంతువు ప్రాణం రాగానే, తనకి అతి సమీపం లో ఉన్న గ్రెగ్ తలని ఒక చేత్తో, భుజాలని ఒక చేత్తో పట్టుకుని తలని ఒక్క ఊపులో మెడ నించి వేరు చేసేసింది. జరిగింది ఏమిటో క్రిస్టినా కి అర్థం అయ్యేలోపు గ్రెగ్ మొండాన్ని విసిరేసి క్రిస్టినా మీదకి వచ్చేసింది. దాని బారి నించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా జేమ్స్, వివేక్, లీ, ఆలేఖ్య వచ్చి క్రిస్టినా నికాపాడారు.

అసుర సంధ్య - 4

ఆ ఆలోచనలతోటే ఆ రాత్రి గడిచిపోయింది. ఎవ్వరికి నిద్ర సరిగ్గా పట్టలేదు. పొద్దున్న అవుతూనే, వివేక్ ఆలేఖ్య ఇద్దరు గుహలోకి బయలుదేరారు. తమతో పాటు వచ్చిన నాయర్ చనిపోవడం ఇద్దరు చాల సీరియస్ గా తీసుకున్నారు. ఎత్తి పరిస్థితులలోను నాయర్ చావుకి కారణం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఇద్దరు గుహలోపలికి వెళ్తుంటే గ్రెగ్ అభ్యంతరం చెప్పాడు. "నిన్ననే నాయర్ని కోల్పోయాం. మళ్ళి మీ ఇద్దరినీ కూడా కోల్పోదల్చుకోలేదు. లోపల నాయర్ ఎందుకు అటు వెళ్ళాడో, ఎందుకు చంపబడ్డాడో మనం తెలుసుకోకుండా మళ్ళి ఆ గుహలోకి వెళ్ళడం అంత మంచిది కాదు." "మేము బంగారం కోసమే ఆ గుహలోకి వెళ్తున్నమనుకుంటే మీరు పొరబడ్డారు. మీకు నాయర్ నాలుగు రోజుల నించి తెలుసు. కాని మాకు ఇద్దరికీ ఆయన నాలుగు సంవత్సరాలుగా తెలుసు. మీకు ఆ గుహలో బంగారం మాత్రమే కనిపిస్తుంది. కాని మా ఇద్దరికీ నాయర్ చావుకి కారణం కనిపిస్తోంది. దానికి మించి మాయా నాగరికత గురించిన విలువయిన సమాచారం ఉంది. మీరు ఒక డాక్టర్.ఒక పేషెంట్ చావు బతుకుల మధ్య ఉంటె చూస్తూ మీరు ఎలా ఊరుకోలేరో ఒక ఆర్కియాలోజికల్ సైట్ ని గాలికి వదిలి మేము ఇద్దరం ఉండలేము. ఇది మా వ్రుత్తి. దానికి మించి మా గురువులాంటి వ్యక్తీ చావుకి కారణం తెలుసుకోవడం మా బాధ్యత" ఆవేశం గ అంది ఆలేఖ్య. తన మాటలు విని జేమ్స్ కూడా వాళ్ళనే సపోర్ట్ చేసాడు. గ్రెగ్, క్రిస్టినా తప్ప అందరు మిగిలిన వాళ్ళు అందరు గుహ లోకి వెళ్లారు. "హౌ ఫూలిష్? చనిపోయిన వ్యక్తి కోసం వీళ్ళ ప్రాణాలు రిస్క్ లో పడేసుకుంటున్నారు. ఒక్క సారి ఈ దీవి లోంచి బయటపడని. నేను ఈ దివికి సేపెరేట్ గ వచ్చి ఈ బంగారాన్ని అంత తీసుకుపోతాను. నువ్వు నేను జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు." అంటు క్రిస్టినా ని కౌగిలిన్చుకున్నాడు. గుహ లోకి వెళ్ళిన లీ, జేమ్స్, వివేక్, ఆలేఖ్య బృందం, వధ్యశాల దాటి ఇంకా ముందుకు వెళ్లారు. వాళ్ళు గుహ లోపలి ఒకట్రెండు కిలోమీటర్లు నడిచి ఉంటారు. అంత దూరం నడిచినా, వాళ్ళకి ఇంకా గుహ అవతలి భాగం కనిపించట్లేదు. కొంచెం ముందుకి వెళ్ళేటప్పటికి గుహ నెలకి సమాంతరంగా కాకుండా నేల లోపలి దిగడం ప్రారంభించింది. వాళ్లకి కుడి వైపున రెండు పెద్ద మందిరాలు కనిపించాయి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ గుహ సహజంగా ఏర్పడిందేమో అనుకున్నారు. కానీ గుహ అంత ఒక పధ్ధతి ప్రకారం కొండని తోలిచినట్టుగా ఉంది. ఆ మందిరం గోడల నిండా రకరకాల బొమ్మలు, మాయ లిపిలో ఏవో శాసనాలు రాసి ఉన్నాయి. వివేక్, ఆలేఖ్య ఆ శాసనాలు చదవడం మొదలు పెట్టారు. వాళ్ళకి అది చాల తేలికగా అనిపించింది. మాయ నాగరికత మిగలిన నాగరికతలకన్న ప్రపంచానికి ఎక్కువ తెలుసు. ఆ శాసనాలు చదువుతున్న కొద్ది వాళ్ళ మొహం లో రంగులు మారడం మొదలయ్యింది. ఆ శాసనం ప్రకారం, ఆ దీవి ఒక క్షుద్రోపాసకుడి ఆధీనంలో ఉండేది. మాయ నాగరికత టైం లో ప్రజలు చిన్న చిన్న గుంపులు గ ఉండేవారు. ఒక తెగకి ఇంకో తెగకి పడేది కాదు. ఆధిపత్య పోరు చాల భీకరంగా ఉండేది. ఒక రాజ్యపు సైన్యం మరో రాజ్యపు ప్రజలని దారుణంగా ఊచకోతకోసి, వారి సంపదనంతా దోచుకునే వారు. శత్రువుల నించి రాజ్యాన్ని రాజ్యపు సంపదని కాపాడుకోవడానికి రాజులు ఈ మాంత్రికుడి దగ్గర తమ సంపదనంతా దాచి ఉంచారు. ఈ మాంత్రికుడు అత్యంత శక్తి యుక్తులు కల వాడు. ఇతని ఆధీనంలో ఎన్నో క్షుద్ర శక్తులు ఉండేవి. ఆ క్షుద్ర శక్తుల సాయంతో ఆ దీవిని ఆ మాంత్రికుడు కాపాడుకునే వాడు. వీరి సంపదని కాపాడుతున్నందుకు ప్రతిగా మంత్రికుడికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చేవాళ్ళు మాయ రాజులు. మాంత్రికుడి ప్రయోగాలకి కావాల్సిన వస్తువులు, జంతువులు, మనుషులు అన్ని సమకూర్చేవారు. ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ మందిరం, ఆ మాంత్రికుడి ప్రయోగ శాల. ఇది చదవగానే బంగారం, ఇతర విలువయిన వస్తువులు ముందు గదుల్లో అన్ని రాసులుగా ఎందుకున్నాయో అర్థం అయ్యింది. అప్పట్లోనే ఇలాంటి విధానం ఉందా అని ఆశ్చర్య పోయారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి దేశం తన దగ్గర ఉన్న బంగారాన్ని ఒక చోట దాచి పెడుతుంది. ఆ నిల్వల్ని బట్టి ఆ దేశ పురోగతి ఆధార పడి ఉంటుంది. ప్రపచంలో అత్యంత ఆకర్షకరమైన దేశం అమెరికా తన బంగారు నిల్వల్ని ఫోర్ట్ నోక్స్ లో దాచి పెడుతుంది. ప్రతి దేశపు మారక విలువ ఆ దేశం వద్ద ఉన్న బంగారు నిల్వల్ని బట్టి నిర్ణయిస్తారు. ఆ శాసనాన్ని బట్టి ఈ దీవికి సమీపం లో మరిన్ని దీవులు కాని, దగ్గరలోనే నేల గాని ఉండి తీరాలి.

సముద్రంలో అలలతో పోటిపడుతూ ఒక మధ్య రకం స్పీడ్ బోటు వేగంగా దూసుకుపోతోంది. అది యు.ఎస్ నావికాదళానికి చెందినది. సరిహద్దు పహారా కాయడం దాని ప్రధాన కర్తవ్యమ్. నాలుగు రోజులనించి సముద్రం లో కూలిన శకలాల కోసం వెతుకుతున్నారు. అప్పటికే విమానం కూలి వారం దాటిపోయింది. విమానం ఎక్కడ మిస్ అయ్యిందో తెలీకపోవడం,వాతావరణం అనుకూలించకపోవడంతో శకలాల వెలికితీత చాల ఆలస్యమయింది. విమానం కూలినప్పుడు తుఫాను తీవ్రంగా ఉండడం, విమానం కూలి వారం అవ్వడం వాళ్ళ, శకలాలు చాల పెద్ద విస్తీర్ణంలో చెల్లా చెదురుగా ఉన్నాయి. సముద్రం లో అంతర్వాహినులు ఉంటాయి. పైకి తెలియని ప్రవాహాలు అవి. వాటిలో చిక్కుకుంటే మీడియం సైజు పడవలు కంట్రోల్ తప్పుతాయి. ఒక్కోసారి నావికులు ఈ అంతర్వాహినుల గమనాన్ని బట్టి ఓడ డైరెక్షన్ మార్చి లాభ పడుతుంటారు. ఎంతో అనుభవం ఉన్నవాళ్ళకి తప్ప మామూలు కంటికి కనిపించవు.అలల తాకిడికి, తుఫాను భీభత్సానికి శకలాలు చెల్లా చెదురు అయిపోయాయి. ప్రయాణీకుల శవాలు సముద్ర ప్రాణులకి ఆహరం అయిపోయాయి. విమానం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. మొత్తం ఎనిమిది బృందాలు బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నాయి. ఎవరైనా బతికి ఉంటారన్న ఆశ లేదు. కనీసం శవాలు అయిన దొరుకుతాయేమో అని వెతుకుతున్నారు. ఇద్దరు సిబ్బంది ఉన్న బోటులో సముద్రంలో చాలా లోపలకి వచ్చారు. సముద్రాన్ని గ్రిడ్ కింద విభజించి రోజు కొంత ప్రాంతాన్ని వెతుకుతున్నారు. చీకటి పడేటప్పటికి వెతుకులాట ఆపేస్తున్నారు. వెతికి వెతికి సిబ్బందికి కూడా విసుగు పుట్టింది. చేసే పని మీద శ్రద్ధ తగ్గింది. ఆటవిడుపుకోసం చేపల వేట మొదలుపెట్టారు. అలా అలా వెతుకుతూ ఉండగా దూరంగా వాళ్ళకి ఒక దీవి కనిపించిది. వాళ్ళదగ్గర ఉన్న మాప్ ప్రకారం అక్కడ ఎటువంటి దీవి లేదు. ఆ దీవిని చూడగానే బోటు నడుపుతున్న జో ఆశ్చర్యం తో విజిల్ వేసాడు. దీవి కనిపించిన సంగతి బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేద్దాం అని వైర్లెస్ సెట్ ఆన్ చేసాడు. గరగర శబ్దం తప్ప సిగ్నల్ రాలేదు. అక్కడ శాటిలైట్ కవరేజ్ లేదు అని అర్థం అవ్వడానికి ఎక్కువ సేపు పట్టలేదు. బహుశ అందుకే ఈ దీవి కూడా మ్యాప్ లో లేదు ఏమో. నెమ్మదిగా దీవి దగ్గరికి పోనిచ్చాడు.
అందరు గుహ లోపలి వెళ్ళగానే క్రిస్టినా, గ్రెగ్ అడవిలో విహారానికి బయలుదేరారు. ఆలా తిరుగుతూ తిరుగుతూ సముద్రం దగ్గరగా వచ్చారు. నడుస్తున్నదల్ల ఉన్నట్టుండి ఆగిపోయింది. "గ్రెగ్ ! నీకు ఏదయినా శబ్దం వినిపిస్తోందా? " అప్పటికే గ్రెగ్ కూడా బోటు శబ్దం విన్నాడు. ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా ఆనందంగా శబ్దం వినిపిస్తున్న వైపు పరిగెత్తారు. ఇద్దరు సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు అప్పుడే ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి దిగితున్నారు. పరుగెడుతున్న గ్రెగ్ క్రిస్టినా ని కూడా ఆపి ఇద్దరు ఒక పొద చాటున దాక్కున్నారు. "హే! ఎం చేస్తున్నావ్? ఎందుకు ఆపేసావ్? బోటు వచ్చింది కదా, అందులోకి అందరం ఎక్కి హ్యాపీగా ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్లిపోవచ్చు కదా. ఈ బంగారం కూడా ఎవరికీ కావలసినంత వాళ్ళం తీసుకుని మిగిలిన లైఫ్ అంతా ఏ లోటు లేకుండా గడపొచ్చు."
"పిచ్చిదానా! ఎవరికి కావలసినంత బంగారం వాళ్ళు కాదు, మనకి కావల్సినంత మనం మాత్రమే తీసుకుందాం. మిగిలిన వాళ్ళని ఈ దీవి మీద వదిలేసి మనం వెళ్లిపోదాం."
“మనం బంగారం తీసుకుని వెళ్తే వీళ్ళు వాటా అడుగుతారు కదా. వాళ్ళు మనల్ని ఎమన్నా చేస్తే? "
"వాళ్ళు బతికుంటే కదా మనల్ని ఎమన్నా చేసేది? “ అంటూ బట్టల చాటు నించి ఒక చిన్న కత్తి తీసాడు. అది విమానంలో సలాడ్స్ కట్ చేయడానికి వాడే కత్తి. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సామాన్లలో దొరికింది అది. ఎందుకన్నా పనికి వస్తుంది అని తీసి ఎవరికి కనిపించకుండా దాచి పెట్టాడు. కత్తి వంక కంగారుగా చూస్తూ
"ఎం చేయ్యబోతున్నావ్ దీనితో?" అంది క్రిస్టినా.
"వెయిట్ అండ్ సి" అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బోటు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బోటు లోంచి దిగి ఇద్దరు తలో వైపు నడుస్తున్నారు. గ్రెగ్ నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరి వెనకగా వెళ్లి ఇద్దరి గొంతు అతి చాకచక్యంగా కోసేసాడు. గ్రెగ్ పనితనం చూసి క్రిస్టినాకి అనుమానం వచ్చింది. అప్పటి దాక ఏదో సరదాగా మాట్లాడుకోవడమే తప్ప గ్రెగ్ గురించి అసలు తనకి ఏమి తెలిదు అని గ్రహించింది. ఈలోపు గ్రెగ్ బోటు ని వడ్డుకి దగ్గరగా పొదల్లోకి లాగి ఆకులు కొమ్మలతో కప్పెసాడు. పడవ లాగిన జాడలు కనిపించకుండా ఇసకని సరిచేసాడు. అప్పటికే శవాలుగ మారిన ఇద్దరినీ సముద్రంలో చేపలకి ఆహారంగా పడేసాడు. గ్రెగ్ తిరిగి రాగానే క్రిస్టినా అడిగింది "ఎవరు నువ్వు?". గ్రెగ్ ఒక పెద్ద హిట్ మాన్. యూరోప్, అమెరికాలలో జరిగిన ఎన్నో రాజకీయ హత్యలు గ్రెగ్ చేతుల మీదుగా జరిగినవే. గ్రెగ్ ఎవరో ఏమిటో ఎవరికి తెలిదు. తనని చూసిన వాళ్ళెవరూ బతకలేదు. తనతో లావాదేవీలు అన్ని అప్పటికప్పుడు ఏర్పరుచుకునే సంకేతాల ద్వార, కోడ్స్ ద్వార జరుగుతాయి తప్ప డైరెక్ట్ గ జరగవు. తను చేసే హత్యలు అన్ని హై ప్రొఫైల్ హత్యలు అవ్వడం వల్ల ఎప్పుడు బహిరంగంగా తిరిగే అవకాసం రాలేదు. ఎలాగు ఈ ఫ్లైట్ క్రాష్ లో తను చనిపోయినట్టు ప్రచారం అయింది కనక ఒక వేళ తిరిగి వెనక్కి వెళ్ళడం అంటూ జరిగితే కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. క్రిస్టినా కూడా ఆ నిర్ణయానికి ఒక కారణం. అదంతా క్రిస్టినా కి చెప్పదల్చుకోలేదు.
"నా గతం తెలియడం వల్ల నీకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎప్పుడు దాని గురించి ఆలోచించకు. ఇక్కడ నించి ఈ రాత్రికే బయటపడి, కొత్త జీవితం మొదలుపెడదాం. చెప్పు ప్రపంచంలో నీకు ఎక్కడ సెటిల్ అవ్వాలని ఉంది? మనం అక్కడే మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం." అన్నాడు గ్రెగ్. "ఈ రాత్రికా? మరి వీళ్ళందరూ?"
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు.ఎంతన్న జేమ్స్ నన్ను కాపాడాడు. మనం మనకి కావల్సినంత బంగారం ఈ పడవలోకి చేరవేసి ఈ దీవి నించి తప్పించుకుందాం. వీళ్ళ అదృష్టం బావుంటే బయటపడతారు. లేక పొతే వీళ్ళ ఖర్మ. " అన్నాడు గ్రెగ్.
ఆ క్షణంలో గ్రెగ్ ని చూస్తె ఒక విదమైన భయం వేసింది క్రిస్టినా కి. కానీ అదే సమయంలో అతని మీద ప్రేమ ఆ భయాన్ని మింగేసింది.

Wednesday, December 2, 2009

అసుర సంధ్య - 3

పొద్దున్న అందరు లేచాక చూస్తె, నాయర్ కనిపించలేదు. అడవిలోకి వెళ్ళాడు ఏమో అనుకున్నారు.రెండు గంటలయినా నాయర్ తిరిగి రాలేదు. వివేక్-ఆలేఖ్య, గ్రెగ్-క్రిస్టినా, లీ-జేమ్స్ మూడు జట్లుగా ఏర్పడి, మూడు వైపులకి వెళ్లారు. అందరు ఒక గంట తర్వాత తిరిగి వచేయ్యాలి అని అనుకున్నారు. గంట తరవాత, అందరు తిరిగి వచ్చేసారు. ఎవరికీ నాయర్ ఎటు వెళ్ళాడు అన్న విషయం అంతుచిక్కలేదు. "ఒక వేళ గుహ లోకి వెళ్ళాడు ఏమో" అంది ఆలేఖ్య. అందరు కలిసి గుహలోకి వెళ్లారు. అక్కడ గుహలోకి కొంచెం లోపలి వెళ్ళాక, నాయర్ శవమై కనిపించాడు. జేమ్స్ దగ్గరికి వెళ్లి చూసి, "సఫకేషన్ వాళ్ళ చనిపోయాడు" అన్నాడు. కాని నడుస్తున్న వాడు ఉన్నట్టుండి అలా ఎలా సఫకేట్ అయ్యాడో ఎవరికీ అర్థం అవ్వలేదు. అయిన అర్థ రాత్రి నాయర్ కి గుహ లో ఎం పని? ఎంత ఆలోచించిన సమాధానం దొరకలేదు ఈ ప్రశ్నలకి.
జేమ్స్ నాయర్ శవాన్ని జాగ్రత్తగా పరీక్షించాడు ఎక్కడన్నా ఎటువంటి దేబ్బలయిన ఉన్నాయేమో అని. కానీ ఒక్కటి కూడా కనిపించలేదు. నాయర్ చివరి క్షణాలలో పడిన నరక యాతన అతని మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నాయర్ శరీరాన్ని అక్కడే గుంట తీసి పాతిపెట్టారు. తిరిగి వస్తుండగా క్రిస్టినాకి సడెన్గా ఏదో గుర్తుకు వచినట్టు ఆగిపోయింది.అందరు తన వంక విచిత్రంగా చూసారు. "వెయిట్. నాయర్ గుహలోకి వెళ్తున్నప్పుడు చావలేదు. గుహలోంచి వస్తున్నప్పుడు చనిపోయాడు. గుహలో అంత సేపు ఉన్నాక ఊపిరి ఆడక పోవడం అన్న మాటే లేదు. పైగా ఈ గుహలోకి గాలి ఉధృతంగా వస్తోంది. సో నాయర్ సహజంగా మరణించలేదు." అంది. ఆ మాటలు వినగానే అప్రయత్నంగా అందరు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. క్రిస్టినా చెప్పింది కరెక్ట్. నాయర్ శవం పది ఉన్న భంగిమ చూస్తె నాయర్ గుహలోంచి బయటకి వస్తున్నట్టుగ ఉంది. చిత్తడి నెల కావడంతో, నాయర్ అడుగు జాడలు ఇంకా ఉన్నాయి. వాటిని అనుసరించి చూడగా అవి అంతకు ముందు వీళ్ళు వెళ్ళిన పగులుని దాటి ఇంకా ముందుకు వెళ్తున్నాయి. లీ, గ్రెగ్ వెళ్దామా వద్ద అన్నట్టుగా మిగిలిన వారి వంక చూసారు.ఎవ్వరు ఏమి మాట్లాడక పోయేటప్పటికి ముందుకు కదిలారు. అలా గుహలో ఒక ఫర్లాంగ్ వెళ్ళేటప్పటికి గుహ రెండు మార్గాలుగా చీలిపోయింది. చీకటి వల్ల అడుగులు కనిపించట్లేదు. అందరు కలిసి కుడి వైపు కి వెళ్లారు. ఇంకొంచెం ముందుకి వెళ్ళాక. ఇంతకూ ముందు లాంటివే మరికొన్ని గదులు ఉన్నాయి. కాకపోతే ఇవి కొంచెం పెద్దగ ఉన్నాయి. ఒక గదిలో అర్ధచంద్రాకరం లో రాళ్ళు ఉన్నాయి. వాటి మధ్య ఒక పెద్ద రాయి ఉంది. వాటిని చూసి వివేక్ భ్రుకుటిముడిపడింది. అంతకు ముందు వివేక్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం, పసిఫిక్ సముద్రం లో వెల్లివిరిసిన నాగరికతలలో మాయ నాగరికత విశిష్టమైనది. మిగలిన నాగరికతలు అన్ని కొంత కాలానికి అంతరించిపోయి మరో నాగరికత పుట్టుకొచ్చింది. కాని మాయ నాగరికత క్రీ. పూ.2500 నించి విలసిల్లుతూనే ఉంది. సుమారుగా నాగరిక మధ్య కాలం దాక అంటే 800 ఉంది. అందువల్ల నేటి విజ్ఞానానికి అతి చేరువగా ఉండేది మాయ నాగరికత. దాని గురించి ఎన్నో పరిశోధనలు చేసారు. కావలసినంత స్టడీ మెటిరియల్ ఉంది. ఆ గదిలో ఉన్న రాళ్ళని చూడగానే అదొక వధ్యసాల అని వివేక్, ఆలేఖ్య గ్రహించారు. మాయ నాగరికత మిగిలిన నాగరికతల లాగే ప్రకృతిని ఉపాసించేది. మాయ నాగరికత సూర్యుడిని, వాన దేవుడిని ఉపాసించేవి. సూర్యుడు వీళ్ళు ఉండే ప్రాంతం మీదనించి ఆరు నెలలకి ఒక సారి పయనించేవాడు. దాన్నే ఇంగ్లిష్లో జేనియాల్ పస్సాజ్ అంటారు. ఆ సమయంలో మతపెద్దలు ఎన్నోనరబలులు ఇచేవారు. ఆ బలి చేయడం కూడా పరమ హేయంగా ఉండేది.మంచి వయసులో ఉన్న కన్యని రెండు రోజులు వివిధ పూజలు చేయించి, తరవాత మతపెద్దకి అంకితం ఇచేవారు. మరునాడు, సరిగ్గా సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో, ఆ యువతిని వివస్త్రని చేసి, కాళ్ళు చేతులు కట్టేసి, ఒక దిమ్మ మీద పడుకోబెట్టి గుండెలు కోసి సూర్యుడికి బలి ఇచేవారు. అది చాల హృదయ విదారకమైన తతంగం. ఇప్పుడు వీళ్ళ బృందం ఉన్నది కూడా అలంటి దిమ్మ దగ్గరే. ఈ విషయాలు చెప్పగానే అందరికి కొద్దిగా భయం, కొంచెం ఇంట్రెస్ట్ పుట్టుకోచాయి. వివేక్, ఆలేఖ్య కి కూడా చాల ఎగ్జియిటింగ్ గ ఉంది. ఎప్పుడు డైరెక్ట్ ఎక్స్కవషన్ లో పాల్గొనలేదు. కేవలం శిలా శాసనాలు చదవడం వాటిని అనువదించడమే పని. అప్పటికే వీళ్ళు లోపలి వెళ్లి చాలా సేపు అవ్వడంతో, తిరిగి వెనక్కి బయలుదేరారు.
బయటికి వచ్చాక, అందరు పళ్ళు తెచుకుని, మంట వేసుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. జేమ్స్ "అసలు నాయర్ మనం అందరం పడుకున్నాక గుహలోకి ఎందుకు వెళ్ళినట్టు? " . "ఒక వేళ బంగారం కోసం వెళ్ళేడెమో " అన్నాడు గ్రెగ్. వివేక్ సాలోచనగా "అయ్యుండొచ్చు. కాని బంగారం తను ఎక్కడికి తీసుకుని వెడతాడు? వెళ్తే అందరం కలిసే వెళ్ళాలి. అది కూడా మనల్ని ఎవరన్న కాపాడడానికి వస్తే సంగతి. ఈలోపు బంగారం దాచి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే మనం ఎక్కడున్నామో మనకే తెలిదు. ఒక వేళ రేస్క్యు టీం వచినా, మనల్ని తీసుకుని వెళ్తారా లేదా అన్నది డౌటే. ఒక వేళ బంగారం కోసమే వెళ్ళాడు అనుకున్న, నాయర్ బంగారం కోసం వెళ్లుంటే, బంగారం ఉన్న చోటు నించి ఇంకా ముందుకి ఎందుకు వెళ్ళడం? నాయర్ అడుగులు కూడా బంగారం గదిలోకి వెళ్ళినట్టు లేవు. డైరెక్ట్ గ బంగారం ఉన్నచోటు దాటి ముందుకి వెళ్ళాడు."
"నిన్న రాత్రి నేను బంగారు గుండ్లని పరిక్షిస్తుంటే నన్ను పడుకోమన్నాడు. పొద్దున్న లేచాక చూద్దాం అనుకున్నాను. నాయర్ మిస్ అయిన హడావిడిలో ఆ సంగతి పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బంగారం ముద్ద కనిపించట్లేదు. దానితో పాటు నాయర్ దగ్గర ఇంకో బంగారు గుండు కూడా ఉండాలి. అది కూడా కనిపించట్లేదు." అంది ఆలేఖ్య. "దట్స్ సస్పిషియస్! మన దగ్గర ఉన్న బంగారం మాయం అయింది. నాయర్ శవం మనకి గుహలోపల దొరికింది....." అంటూ మధ్యలో ఏదో ఆలోచన తట్టినట్టు ఆపేసాడు లీ. లేచి నాయర్ పడుకున్న చోట వెతికాడు. అక్కడ నేల మీద ఏవో గీతలు రాసి ఉన్నాయి. ఆలేఖ్య వివేక్ వాటిని చూసి, "ఇవి బహుశ ఆ బంగారం గుండ్ల మీద ఉండి ఉంటాయి. వాటిని ఇక్కడ మట్టి మీద నోట్ చేసుకున్నాడు".
ఆలేఖ్య ఆ గీతలమీదకి ఒంగి "ఇదేదో శాసనంలా ఉంది. దీని ప్రకారం ఈ బంగారం అంతా తియోథిహువాకాన్ అనే రాజ్యన్ని పాలించే కుల్ ఆహువా కి చెందినది. దీన్ని అను నిత్యం రాజు అంతరంగిక సేవకులు కాపాడుతూ ఉంటారు. ఈ బంగారాన్ని తాకినా, హస్తగతం చేసుకోవాలని అనుకున్నా, వారిని రాజు అంతరంగిక సేవకులు సంహరిస్తారు. ఈ బంగారం కేవలం వర్తకానికి మాత్రమె సింహాసనాన్ని అధిరోహించిన వారికి సొంతం." అని ఉంది. కుల్ ఆహువా అంటే మాయ నాగరికతలో రాజు అని అర్థం. అంటే బంగారపు ముద్దలు ఉన్న గది రాజు కోశాగారం అన్నమాట. అంటే ఈ శాసనం చదివి బంగారం అక్కడ తిరిగి పెట్టేయడానికి వెళ్ళాడా నాయర్? అక్కడ పెట్టి వస్తుంటే ఏదో తన దృష్టిని ఆకర్షించి ఉంటుంది. అందుకని కోశాగారం దాటి ముందుకి వెళ్ళాడు. కాని అక్కడినించి తిరిగి వచేటప్పుడు ఏదో అయ్యింది. ఒక వేళ అది నాచురల్ డెత్ అయ్యుంటే, ఆరోజు పొద్దున్న అయిదుగురు వెళ్లారు గుహ లోపలి. ఆక్సిజెన్ సరిపోక అయిన మరణం కాదది. some mystery is there which should be unveiled.

అసుర సంధ్య - 2

ఎవ్వరు ఏమి మాట్లాడుకోవట్లేదు. రెస్కుబోటు వస్తుందేమో అన్న ఆశతో వాళ్ళు అలానే ఒడ్డు దగ్గరే కూర్చుని ఉన్నారు. చీకటి పడే కొద్ది రెస్క్యు టీం వస్తుంది అన్న ఆశ సన్నగిల్లడం మొదలయ్యింది. అందరికి ఆకలి వెయ్యడం మొదలయ్యింది. కొంచెం ధైర్యం గ ఉన్నది లీ, జేమ్స్ ఇద్దరే. మిగిలిన వాళ్ళంతా కదిలిస్తే ఎడ్చేసే స్థితి లో ఉన్నారు. అది మాస్ hysteria కి దారి తీస్తుంది. అది అసలు ప్రమాదానికన్న పెద్ద ప్రమాదం. లీ జేమ్స్ మిగిలిన వాళ్లతో ఏమి చెప్పకుండా ద్వీపం లో కి వెళ్లి ఎమన్నా తినడానికి దొరుకుతుందేమో అని బయలుదేరారు. వాళ్ళు ఉన్నది చాల విచిత్రమైన దీవి. ఆ దీవి చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల మధ్యలో లోయ లాగా ఉంది.జేమ్స్ లండన్ నించి అమెరికా చాల సార్లు వచాడు. కానీ అలంటి దీవి గురించి చదివినట్టు కాని విన్నట్టు కానీ గుర్తులేదు. ఒక గంట సేపు వెతికితే అందరికి తినడానికి సరిపడా పళ్ళు దొరికాయి. వాళ్ళు ఒడ్డు దగ్గరికి వచెటప్పటికి ఆలేఖ్య క్రిస్టినా ఏడుస్తూ కనిపించారు. వివేక ఆలేఖ్యని సముదాయిస్తున్నాడు. జేమ్స్ తన వ్రుత్తి వల్ల వచ్చిన పెద్దరికం తో "ఆలేఖ్య....డోంట్ క్రై. ఇట్ విల్ నాట్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. " అని తనతో ఉన్న పళ్ళు ఇచ్చాడు. ఆ రాత్రి అంతా అక్కడే చలిలో గడిపారు.ఒడ్డుకి కొట్టుకొచ్చిన సామాన్లతో మంట వేసుకుని ఆ రాత్రి గడిపారు. అలాంటి రాత్రులు మరో రెండు గడిచాక రెస్క్యు టీం వస్తుంది అన్న ఆశ సన్నగిల్లింది. ఈ రెండు రోజుల్లోనూ ఎవరు ఎవరితో పెద్దగ మాట్లాడలేదు. రోజంతా సముద్రం వంక చూస్తూ ఉండడం, ఆకలి వేసినప్పుడు ఇద్దరు ఇద్దరు వెళ్లి అందరికి కవలిసినపల్లు తేవడం. ఇదే దినచర్య. మూడో రోజు సగం అయ్యాక

"ఇలానే చలిలో ఉంటె రెస్కు టీం మనల్ని కనుక్కునే లోపు మనం చలి గాలికి చచ్చిపోతాం. మనం ఏదో ఒకటి ఆలోచించాలి" అన్నాడు గ్రెగ్. అది నిజమే.సముద్రపు గాలి అంత మంచిది కాదు. అప్పటికప్పుడు అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. జేమ్స్, నాయర్, లీ, గ్రెగ్ దీవిలోకి వెళ్లి ఉండడానికి ఏదయినా చోటు ఉందేమో వెతికేటట్టు మిగిలిన వాళ్ళు ఒడ్డు దగ్గరే ఉండేటట్టు ఒప్పందం కుదిరింది. వెంటనే నలుగురు కలిసి దీవిలోకి బయలుదేరారు. పక్షుల కిల కిల రావాలు తప్ప దీవి నిశ్శబ్దంగా ఉంది. దీవి అంతా దట్టమైన చెట్లతో, విచిత్రమైన పొదలతో నిండి వుంది. అడుగు తీసి అడుగు వెయ్యడం చాల కష్టంగా ఉంది. అల అడవిలోకి నాలుగయిదు మైళ్ళు నడిచాక నాయర్ నీరసంగా ఉంది అంటూ ఒక చెట్టు పక్కన కూర్చుండి పోయాడు. నాయర్ కూడా ఆలేఖ్య వివేక వెళ్తున్న టీం లోని వాడే. వీళ్ళ టీం కి మేనేజర్. నలభయ్యో వడిలో పడుతున్నాడు. మిగిలిన వాళ్ళతో సమానం గ నడవలేక పోతున్నాడు. అందరు కూర్చున్నారు. కొంచెం సేపు అయ్యాక లీ అన్నాడు. "ఎంత దూరం నడిచిన ఏమి కనిపించట్లేదు. ఎవ్వరు ఉంటున్నట్లు లేదు ఈ దీవి." లీ చెట్టు ఎక్కి చూసాడు. చూసిన వాడు చూసినట్టు అలానే ఉండి పోయాడు. లీ ఎంత సేపటికి ఏమి మాట్లాడక పోవడం తో జేమ్స్ లీ ని పిలిచాడు. లీ గబగబా చెట్టు దిగి ఆశ్చర్యంతో

"కొంచెం ముందుకి వెళ్తే విశాలమైన మైదానం ఉంది. అక్కడ ఏవో కట్టడాలు ఉన్నాయి."

వెంటనే అందరికి ఉత్సాహం వచ్చి పరుగులాంటి నడకతో అక్కడికి వెళ్లారు. లీ చెప్పినట్టుగానే అక్కడ కొన్ని రాతి కట్టడాలు ఉన్నాయి. సుమారుగా శిధిలావస్థకు చేరుకున్నాయి. ఆర్కియాలజీ డిపార్టుమెంటు లో పదిహేను సంవత్సరాలు పనిచేసిన నాయర్ కి అవి పురాతన కాలానికి చెందినవని గ్రహించడానికి ఎక్కువ సేపు పట్టలేదు. అదే విషయాన్నీ అందరికి చెప్పాడు. ఆ రాతి కట్టడాలు అన్ని దట్టమైన చెట్ల మధ్యలో ఉన్నాయి. అక్కడే కొంత సేపు ఉండి వెనక్కు బయలుదేరుతుంటే ఒక రాతి కట్టడం వెనుకగా పెద్ద విగ్రహం కనిపించింది. ఆ విగ్రహం ఏమిటా అని అంతా అటుగా వెళ్ళేటప్పటికి ఆ విగ్రహం పక్కనే పెద్ద గుహ కనిపించింది. అందులోకి వెళ్ళాలా వద్ద అని ఆలోచనలో పడ్డాడు జేమ్స్. అందరిని పిలిచి చూపించాడు. అప్పటికే వాళ్ళు ఒడ్డు నించి బయలుదేరి చాల సేపయ్యింది. తిరిగి వెళ్ళడమే మంచిది అని అనుకుని వెనక్కి తిరిగారు. చీకటి పడే దాక అక్కడ ఉండి, చీకటి పడే సమయానికి ఈ ప్రదేశానికి తిరిగి వద్దాం అనుకున్నారు. వెళ్ళే దారిలో కనిపించిన పళ్ళని కోసుకుంటూ వెళ్లారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆలేఖ్య, వివేక్, క్రిస్టినా ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. క్రిస్టినా జర్మన్. అక్కడ జర్నలిస్ట్. తన ఫ్రెండ్ ని కలవడానికి అమెరికా వెళ్తోంది. పళ్ళతో వస్తున్నా వీళ్ళ నలుగురిని చూసి కబుర్లు ఆపారు. పళ్ళు తింటూ ఉండగా దీవిలో చూసిన రాతి కట్టడాల గురించి చెప్పాడు నాయర్. ఆలేఖ్య వివేక్ లు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళు ఎంత సేపు వాళ్ళ స్టోర్ రూంలో ఉన్న వస్తువుల్ని స్టడీ చేయడం తప్ప ఎప్పుడు డైరెక్ట్ excavation లో డైరెక్ట్ గ పాల్గొనలేదు. పళ్ళు తినగానే ఒడ్డున ఉన్న సమన్లలో పనికి వచ్చే సామాను కలెక్ట్ చేసుకుని నెమ్మదిగా అడవిలోకి బయలుదేరారు. ఒక గంట నడిచేటప్పటికి అంతకుముందు వచ్చిన ప్రదేశానికి వచ్చారు. అందరు రంగంలోకి దిగి ఉండడానికి రెండు రాతి కట్టడాలు సిద్ధం చేసారు.


3

చీకటి పడ్డాక అందరు అక్కడ దొరికిన ఎండు కొమ్మలు అవి పేర్చి మంట వేసుకున్నారు. జంతువులకి నిప్పు అంటే భయం. నిప్పు ఉన్నంత సేపు ఆ దరిదాపులకి కూడా రావు. పొద్దున్న నించి బాగా కష్టపడడం వల్ల అందరికి వెంటనే నిద్ర పట్టేసింది. కొన్ని గంటలు గడిచాక ఏవో శబ్దాలు వినిపించి అందరికి మెలకువ వచ్చింది. "ఏంటి పగలంతా నిశబ్దంగా ఉన్న దీవి లో రాత్రి ఈ శబ్దాలు ఏంటి?" భయం భయంగ అడిగింది ఆలేఖ్య. అందరు కలిసి శబ్దం వస్తున్న వైపు నడవనారంభించారు. శబ్దాలు వీళ్ళు ఉన్న రాతి సముదాయాల వెనక నించి వస్తున్నాయి. అడుగులో అడుగు వేసుకుంటూ అంతా ఆ దిశగా నడుస్తున్నారు. లీ చేతికి దొరికిన కొమ్మనొక దాన్ని తీసుకున్నాడు. గ్రెగ్ మండుతున్న నెగడులొన్చి ఒక కర్రని తీసుకుని కాగడాలాగా పట్టుకున్నాడు. శబ్దాలు విగ్రహం వెనకనున్న గుహలోంచి వస్తున్నాయి. లోపలికి వెళ్ళాలా వద్ద అని అందరు అనుమానంగా ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఉన్నారు. లీ జేమ్స్, వివేక కొంచెం ధైర్యంగా ముందుకి వెళ్లారు. గుహ మొదట్లోకి వెళ్ళేటప్పటికి శబ్దాల తీవ్రత మరింత పెరిగింది. లీ వివేక్ జేమ్స్ తడబడుతూ గుహలో ప్రవేశించారు. గుహ చాల విశాలంగా ఉంది. ముఖ ద్వారం చిన్నదిగా ఉన్నా లోపల వంద అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తులో చాలా విశాలంగా ఉంది. గుహ పై భాగం లో గబ్బిలాలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయనడానికి గుర్తుగా గుహ కింద భాగమంతా వాటి రెట్టలతో చిత్తడి చిత్తడిగ ఉంది. ఆ చిత్తడి నేల గుహలో ఒక అర కిలోమీటరు ఉంది . గుహలోకి ఉద్ద్రుతమైన గాలి వస్తోంది. అది ఎక్కడి నించి వస్తోందో తెలిదు. బహుశ కొండకి అటువైపు నించి వస్తుంది ఏమో అనుకున్నారు. చేతిలో ఉన్న కాగడ ఎక్కువసేపు వెలగదు అని గ్రహించి మళ్లీ వెనుతిరగబొయారు. అలా తిరుగుతుండగా వారికి ఎడమ పక్కన గోడలో చిన్న పగులు కనిపించించింది. ఆ పగులులో ఏముందో చూడాలని అనిపించింది వివేక్కి . మర్నాడు చూద్దాములే అని సరిపుచుకున్నాడు వివేక్. అంతా బయటికి వచ్చేసరికి కాగడ ఆరిపోయింది. ఒక్కసారిగా అంతా లోపల నించి వచ్చే శబ్దాలు ఏంటి అని అడిగారు. ఆ శబ్దాలు గాలి వల్ల వస్తున్నాయి అని తెలిసాక అందరు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చాక వివేక్, ఆలేఖ్య, క్రిస్టినా, గ్రెగ్ ఒక చోట, లీ, నాయర్, జేమ్స్ ఒక చోట పడుకున్నారు. రాత్రంతా ఒకరికి ఒకరు అంత దగ్గరగా పడుకోవడం వల్ల వివేక్, ఆలేఖ్య ఇద్దరు చాలా ఎగ్జయిట్ అయ్యారు. ఇద్దరికీ నిద్ర సరిగ్గా పట్టలేదు. తెల్లవారుతోంది అనగా వివేక్ లేచి ఇవతలకి వచ్చాడు. ఆ అలికిడికి ఆలేఖ్య కూడా మెలకువ వచ్చింది. వివేక్ వెనకాలే వచ్చి వివేక్ ని వెనకాల నించి వాటేసుకుంది. వివేక్ ఒక్క క్షణం ఉలిక్కి పడ్డా వెంటనే తమాయించుకొని వెనక్కి తిరిగాడు. "ఆలేఖ్య! ఏంటిది?" అని అడిగాడు. ఆలేఖ్య కొంటెగా వివేక్ వంక చూసి "నేను విమానంలో అడిగిన దానికినువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు" అంది. వివేక్కి తను అంటున్నది ఏమిటో లిప్తకాలం గుర్తురాలేదు. వచ్చిన తరవాత ఆనందం, సిగ్గు వల్ల మొహం ఎర్రగా కందిపోయింది. ఎంతోకాలంగా గుండెల్లో దాచుకున్న ప్రేమ ఉప్పెనలా వచ్చి నోటికి మాట పెగల్లేదు. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్నారు. అన్నాళ్లుగా ఇద్దరికీ పరిచయం ఉన్నా ఎప్పుడు మనసు విప్పి మాట్లాడుకోలేదు. ఇప్పుడు అయాచితంగా దొరికిన ఏకాంతాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలా మాటల మధ్యలో అంతకుముందు రాత్రి గుహలో విషయాలు కూడా దొర్లినాయి. ఆ గోడ పగులుకి అవతల ఏముందో తెలుసుకోవాలనుకున్నారు. అప్పటికే వీళ్ళిద్దరూ వచ్చి గంట దాటింది. అందరు వెతుక్కుంటారేమో అని తిరిగి వీళ్ళు ఉంటున్న చోటికి తిరిగి వచ్చారు. అప్పుడే మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళ తరవాత ఒకళ్ళు నిద్రలేస్తున్నారు. అడవిలోంచి ఆనందంగా ఒకరి చెయ్యి ఒకళ్ళు పట్టుకుని నడుస్తున్న వీళ్ళని చూసి అంతా ముసిముసిగా నవ్వుకున్నారు. అందరు కాలకృత్యాలు తీర్చుకుని సముద్రపు వడ్డు దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. రేస్క్యు టీం కోసం ఎదురు చూస్తూ గడిపారు. కొంచెం సేపు అయ్యాక "నాకు ఏమి తోచట్లేదు. అలా వొడ్డున కొంచెం దూరం నడుస్తాను" అని లేచింది ఆలేఖ్య. లేస్తూ లేస్తూ వివేక్ వంక ఓర కంటితో చూసింది. వివేక్ కూడా లేచి నిలబడ్డాడు. ఇద్దరు అలా కొంచెం దూరం నడిచాక ఆలేఖ్య సముద్రం లోకి పరుగెత్తుకుంటూ వెళ్ళింది. "ఏయ్ ఏయ్ ఆగు! ఎం చేస్తున్నావ్? వెనక్కి రా! " అని అరుస్తూ వివేక్ కూడా ఆలేఖ్య వెనకాలే పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఆలేఖ్య నీళ్ళలోంచి ఒక బాగ్ తీసి "వివేక్! ఇది నా టూల్ కిట్. నాకు ఉద్యోగం వచినప్పుడు మా నాన్నగారు నాకోసం గిఫ్ట్ చేసారు. ఎక్కడికి వెళ్ళినా నాతోటి తీసుకువెళ్తాను. మొన్న ఆక్సిడెంట్లో సముద్రంలో పడిపోయింది. మళ్ళి ఇదిగో ఇప్పుడు దొరికింది." అంది చిన్న పిల్లలా ఆనందిస్తూ. అలా అంటుండగానే కళ్ళలో నీళ్ళు చిప్పిల్లాయి. వివేక్ నెమ్మదిగా అనునయించి ఆలేఖ్యని దగ్గరకి తీసుకున్నాడు. ఇద్దరు తిరిగి మిగిలిన వాళ్ళు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికి మిగిలినవాళ్ళకి కూడా బోర్ కొట్టినట్టుంది. ఒడ్డున విమానం నించి విడివడిన సామాను కుప్పలు కుప్పలుగా పడి ఉంది. అందరు తలా ఒక కుప్ప దగ్గరికి వెళ్లి పనికి వచేయి ఎమన్నా ఉన్నాయేమో అని వెతుకుతున్నారు. కొన్ని బట్టలు, కొన్ని వస్తువులు సేకరించారు. అంతా తిరిగి గూడేనికి చేరుకున్నారు. అప్పటికి ఇంకా మధ్యాహ్నమే అయింది. ఎం చెయ్యాలో ఎవ్వరికి తోచలేదు. అప్పుడు సడెన్ గా వివేక్ కి గూడలో కనిపించిన సన్నటి పగులు గుర్తొచ్చింది. ముందు అభ్యంతరం చెప్పినా, చివరికి అందరు ఒప్పుకున్నారు. కొంచెం ఇబ్బందితో అందరు చిత్తడి నేల దాటారు. వివేక్ నిన్న రాత్రి చూసిన పగులుని చూపించాడు. ఒక మనిషి పక్కకి తిరిగి నడిచేంత మాత్రమే ఉంది ఆ పగులు. ముందుగ గ్రెగ్ పగులులోంచి చూసాడు. పడి అడుగుల మందం ఉంది అక్కడ గుహ గోడ. నెమ్మదిగా అటు వైపు వెళ్ళాడు గ్రెగ్. లీ పగులుకి ఎదురుగ కాగడ పట్టుకుని నిలబడ్డాడు. గ్రెగ్ అవతలి వైపుకి చేరగానే ఒకళ్ళ తరవాత ఒకళ్ళు అందరు ఆ పగులులోకి వెళ్లారు. చివరా నాయర్ ఆ పగులులోకి ప్రవేశించాడు. అవతలి దృశ్యం చూడగానే అందరికి మతులు భ్రమించాయ అన్న అనుమానం కలిగింది. అక్కడ పెద్ద ఆడిటోరియంలాగా ఉంది. ఆడిటోరియం గోడలు పచ్చని కాంతితో వెలుగుతున్నాయి. జేమ్స్ గోడ వంక పరీక్షగా చూసి, చిన్న విజిల్ వేసాడు. కొన్ని జీవాలకి వెలిగే గుణం ఉంటుంది. మిణుగురు పురుగు, జెల్లీ ఫిష్ ఆలాంటి కోవకి చెందినవే. ఇప్పుడు గోడ మీద అలాంటి జీవి ఉంది. ఆ గుహ గోడలకి ఒక రకమైన నాచు పట్టింది. దానివల్లే ఆడిటోరియం వెలుగుతోంది. ఆ వెలుగులో ఆడిటోరియంలో ఉన్నవి అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆడిటోరియంలో కొన్ని gundrati రాళ్ళు పెర్చినట్టు కుప్పలు కుప్పలుగ ఉన్నాయి. రాళ్ళని ఆలా గుహ లోపల ఆడిటోరియం లోకి మోసుకువచ్చి అక్కడ పెట్టినవారెవరో ఎంతకీ అర్థం కాలేదు. వివేక అందులో ఒక రాయిని పట్టుకుని చూసాడు. అది గట్టిగ ఇనప గుండులాగా ఉంది. దాన్ని ఎత్తి నేలకేసి కొట్టాడు. ఖంగు మని శబ్దం వచ్చి గుహ అంతా మారుమోగిపోయింది. ఆ రాయికి పట్టుకుని ఉన్న దుమ్ము అంతా రాలిపోయింది. వివేక కి తన కళ్ళని, నమ్మాలా లేదో అర్థం అవ్వలేదు. తను కింద పడేసింది మామూలు గుండు కాదు. బంగారపు గుండు. ఆ గుండు సుమారుగా అయిదు కిలోలు ఉంది. అందరు సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ నిలబడ్డారు. అందరికన్నా ముందుగ తేరుకున్నది నాయర్. తను చకచక కదిలి మరో రెండు గుండ్లని అలానే నేలకేసి కొట్టాడు. అవి కూడా బంగారు గుండ్లే. ఆలాంటి గుండ్లు సుమారుగా వెయ్యి పైనే ఉన్నాయి. ఎవరో ఆ బంగారు గుండ్లని తయారు చేసి అక్కడ పెట్టినట్టు గ్రహించారు. ఆ రాతి కట్టడాలు, అవి తయారు చేసిన వాళ్ళవి అనిపించింది. ఆ ఆడిటోరియం అవతల చిన్న ద్వారం ఉంది. ఆ ద్వారం గుండా వివేక్, ఆలేఖ్య వెళ్లారు.అక్కడ గోడల మీద కుడ్యచిత్రాలు ఉన్నాయి. అవన్నీ క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల కిందవని వివేక్ ఆలేఖ్య వెంటనే గ్రహించారు. ఆ చిత్రాల నిండా రకరకాల లోహ వస్తువులతో పనిచేస్తున్న మనుషుల చిత్రాలు ఉన్నాయి. ఆ గుహ మొత్తం ఆలాంటి చిన్న చిన్న గదులు బోల్డు ఉన్నాయి. ఇంకొంచెం లోపలి వెళ్తే అక్కడ గుహ మరింత ఎత్తుగా మరింత వెడల్పుగా ఉంది. గుహ బయట ఉన్నట్టుగానే గుహ లోపల కూడా చాలా రాతి కట్టడాలు ఉన్నాయి. అవి అక్కడ ఒకప్పుడు నివసించిన వాళ్ళవి. వాళ్ళు అక్కడ ఉండి వివిధ లోహాలతో పనిముట్లు తయారు చేసుకునే వారు. కానీ బంగారాన్ని ఆలా ముద్దలు ముద్దలు గ చేసి నిలవ ఉంచాల్సిన అవసరం ఏమిటో ఎంత ఆలోచించినా అర్థం అవ్వలేదు. పార్టి గదిలోనూ గోడల మీద బొమ్మలు, పక్కన ఏవో శాసనాలు, కొన్ని గుండ్లు పధ్ధతి ప్రకారం వరసల్లో అమర్చి ఉన్నాయి. ముందుగ ఎక్స్పెక్ట్ చెయ్యకపోవడం వల్ల వివేక్, ఆలేఖ్య తమతో ఏమి తెచ్చుకోలేదు. బయట ఉన్న రాతి కట్టడాలు పాతవి అనుకున్నారు కాని, లోహ యుగానికి చెందినవి అని అనుకోలేదు. అప్పటికే వాళ్ళు గుహలోకి వచ్చి చాలా సేపు అవ్వడంతో వెనక్కి వెళ్లి మళ్ళి మర్నాడు వద్దాం అనుకున్నారు. నాయర్, వివేక్ ఇద్దరు చెరొక బంగారు గుండు బయటకి తీసుకునివచ్చారు. వాళ్ళు బయటికి వచ్చేటప్పటికి చీకట్లు ముసురుకుంటున్నాయి. వెంటనే అందరు కొద్దిగా ఫ్రెష్ అయ్యి, కొన్ని పళ్ళు కోసుకుని వచ్చి మంట చుట్టూ కూర్చున్నారు. అందరికి నోట మాట రావట్లేదు. అంత బంగారం ఎవరు తమ తమ జీవితాలలో చూసుండరు. అంత ఇద్దరు ఇద్దరుగ మాట్లాడుకుంటున్నారు. దీవి నించి బయటపడ్డాక ఆ బంగారంతో ఎవరు ఎం చెయ్యదలుచుకున్నారో మాట్లాడుకుంటున్నారు. నాయర్, వివేక్, ఆలేఖ్య బంగారు ముద్దని పరీక్షిస్తున్నారు. బంగారు ముద్దా మీద ఏదో రాసి ఉన్నట్టు అనిపించింది ఆలేఖ్యకి. వెంటనే వెళ్లి ఆ రోజు పొద్దున్న దొరికిన టూల్ కిట్ తీసుకువచి అందులోంచి భూతద్దం తీసుకుని పరిక్షించసాగింది. తన ఊహ కరెక్ట్. ఆ బంగారు ముద్ద మీద ఏదో రాసి ఉంది. బహుశ ఆ బంగారు గుండ్లని తయారు చేయించిన వాళ్ళ గురించి ఉందేమో అనుకుంది. వెంటనే ఒక పెన్ను, పేపర్ తీసుకుని తనకి కనిపించింది కనిపించినట్టు నోట్ చేసుకోవడం మొదలుపెట్టింది. మొదటి గుండు అయిపోయాక, రెండో గుండు మీద ఏముందో చూసింది. రెండో గుండు మీద కూడా సుమారుగా మొదటి గుండు మీద ఉన్నదే ఉంది. నోట్ చేసుకోవడం అయ్యాక నాయర్, వివేక్, ఆలేఖ్య దాన్ని విశ్లేషించడం మొదలుపెట్టారు. మిగిలిన వాళ్ళు ఇంకా వాళ్ళ వాళ్ళ కబుర్లలో ఉన్నారు. కొంచెం సేపటికి అందరికి బోర్ కొట్టడం మొదలుపెట్టింది. క్రిస్టినా, గ్రెగ్ లేచి నిలబడ్డారు. వాళ్ళు ఇద్దరు మండుతున్న నెగడు లోంచి ఒక కొమ్మ తీసుకుని అడవిలోకి వెళ్లి వస్తామన్నారు. "ఎక్కువ దూరం వెళ్ళకండి. అడవిలో మిమ్మల్ని వెతకడం కష్టమవుతుంది" అన్నాడు జేమ్స్. నాయర్ నవ్వుతు "వెళ్ళని లే, మనకి బంగారం ఇంకొంచెం ఎక్కువ దక్కుతుంది" అన్నాడు. లిప్త పాటు గ్రెగ్ మొహంలో నవ్వు మాయం అయ్యింది, మళ్ళి నవ్వు తెచ్చుకుంటూ ". ఒక గంట తరవాత గ్రెగ్, క్రిస్టినా తిరిగి వచ్చేసారు. అప్పటిదాకా ఏదో సీరియస్ విషయం మాట్లాడుకున్నట్టు ఇద్దరు గంభీరంగా ఉన్నారు. అందరు పళ్ళు తిని పడుకున్నారు. "ఆలేఖ్య నువ్వు కూడా పడుకో. రేపు చూసుకుందాము" అన్నాడు నాయర్.

అసుర సంధ్య - 1

చుట్టు సముద్రం….నిర్మానుష్యమయిన దీవి…….ఎత్తయిన కొండలు……దట్టంగా పరుచుకున్న చీకట్లు. ఆ చీకట్లో, దారి వెతుక్కుంటూ చెట్లను తడుముకుంటు ఒక మానవాకారం అడుగులొ అడుగు వేసుకుంటూ నడుస్తొంది. ఇంతలో ఉన్నట్టుండి హోరు గాలి మొదలయ్యింది. దట్టమయిన మేఘాలు కమ్ముకోసాగినై. టపటపా సూదుల్లా చినుకులు మొదలయ్యాయి.కన్ను పొడుచుకున్నా కాన రాని చీకట్లొ ఆ ఆకారం ముందుకు నెమ్మదిగా సాగుతొంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగ కురుస్తొంది వాన. ఫెటెల్మని ఒక మెరుపు మెరిసింది. చెవులు చిల్లులు పడె శబ్దం. యాభై గజాల దూరంలొ ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద పిడుగు పడింది. ఆ పిడుగు పాటుకి పచ్చటి చెట్టు నిలువునా బూడిదయ్యింది...

ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆలేఖ్య. నుదుట పట్టిన చెమటని తుడుచుకుంటు కంగారుగా చుట్టు చూసింది. అప్పటికి కాని తను నిద్రలొ కల కన్నట్లు అర్ధమవ్వలేదు. పసిఫిక్ సముద్రం మీదుగ భూమికి 60వేల అదుగుల ఎత్తులొ ప్రయాణిస్తొంది బ్రిటీష్ ఎయిర్వేస్ కి చెందిన విమాణం. తననే ఆందోళనగా చూస్తున్న వివేక్ వంక 'ఏం ఫర్వలేదు ' అన్నట్లుగ కళ్ళతోనె సైగ చేసింది. చికాగొలో జరగనున్న ఆర్కియాలజిస్ట్స్ సెమినార్ కి భారత దేశం నించి వెళ్తున్న పదిహేను మంది బృందంలో వివేక్, ఆలేఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యారు.

కిటికీలోంచి బయటికి చూసిన ఆలేఖ్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన కలలో చూసిన ఉధృతమైన వాన మరోసారి కళ్ళముందు మెదిలింది. కలలో చూసిన దృశ్యాలే కళ్ళ ముందు మెదిలెటప్పటికి మనసంతా అదోరకమైన వ్యాకుళతతో నిండిపోయింది. విమాణం తుఫానులో చిక్కుకుంది అని గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. విమాణంలొ ఉన్న ప్రయాణికులు కంగారు పడకుండా ఎయిర్ హోస్టెస్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి పరిస్థుతులలోను చెరగని చిరునవ్వుతో ఉండగల నేర్పు ట్రైనింగ్ లోనే నేర్పుతారు. లండన్ నించి టేకాఫ్ తీసుకునెటప్పుడు తుఫాను ఇంత ఉధృతంగా లేదు. తుఫాను ఉన్నట్లుండి బలపడింది. అదే విషయాన్ని పైలట్ ప్రయాణికులందరికి పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వార రిపీటెడ్ అన్నౌన్సెమెంట్స్ చేస్తున్నాడు.

మరోసారి పబ్లిక్ అడ్రెస్స్ సిస్టంలొ పైలట్ కంఠం వినిపించింది. 'ఒన్ ఆఫ్ అవర్ పాస్సెంజెర్స్ నీడ్ మెడికల్ అస్సిస్టెన్స్. పాస్సెంజెర్స్ లిస్ట్ లొ డాక్టర్స్ ఎవరు లేరు. సహాయ పడగల వాళ్ళు దయచేసి కౄని సంప్రదించండీ. ప్రతీ డాక్టర్ విమాణ ప్రయణం చేసేటప్పుడు విధిగ తను డాక్టర్ అని డిక్లేర్ చెయ్యాలి. ఆలేఖ్య ముందు సీట్లొ వ్యక్తి పేరు డాక్టర్ జేంస్ పాట్రిక్సన్. అతను లేచి దగ్గరలో ఉన్న ఎయిర్ హొస్టెస్స్ ని పిలిచాడు. విమాణం షెడ్యుల్ కొద్దిగా లేట్ అవ్వడంతొ ఎవరొ పాస్సెంజెర్ ఇంజెక్షన్ తీసుకొవడం మర్చిపోయాదు. అతనికి ఇంజెక్షన్ ఇచ్చి జేంస్ తన సీట్ కి తిరిగి వచ్చాదు. కూర్చునేముందు ఆలేఖ్య వంక చూసి పలకరింపుగా నవ్వి కూర్చున్నాడు. మరో ఆరు గంటలు ప్రయాణం చెయ్యలి అనుకుంటు ఆలేఖ్య తన ముందు ఉన్న మాగజెన్స్ తిరగెయ్యడం మొదలు పెట్టింది. అలా కొంతసేపు చదివాక తనని ఎవరొ చూస్తున్నట్టనిపించి తల ఎత్తింది. అప్పటి దాక ఆలేఖ్యనె చూస్తున్న వివేక్ చప్పున చూపు తిప్పుకున్నాడు. వివేక్ స్వతహాగ తన పని తను చూసుకునే రకం. డిగ్రీ నించి కలిసి చదువుకుని, ఒకే చోట ఉద్యోగం వచ్చినా కూడ స్వతంత్రంగ ఆలేఖ్యని పలకరించితె తప్ప పలకరించడు. చాలా బిడియస్తుడు. వివేక్ కి ఆలేఖ్య అంటె ఇష్టమని చదువుకునే రొజుల్లోనె ఆలేఖ్య గమనించింది. తనంతట తను వచ్చి ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చెస్తాడా అని ఆరు సంవత్సరాలుగా ఎదురు చూస్తొంది. ఇక వివేక్ ప్రపోజ్ చెసేదాకా వెయిట్ చెయ్యడం లాభం లేదు అనుకుని ఆలేఖ్య సూటిగ వివేక్ కళ్ళలొకి చూస్తూ అడగనే అడిగింది 'వివేక్! నా మీద నీ అభిప్రాయం ఎంటి?'

ఎటువంటి మగడు అయినా ఒక అమ్మాయి అలా అడిగితె ఉక్కిరిబిక్కిరి అవుతాడు. వివేక్ కూడా అందుకు అతీతుడేమీ కాదు. ఆలేఖ్య మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం అవ్వలేదు. ముందు ఆశ్చర్యం, అంతలోనె ఆనందం....ఎగిరి గంతులెయ్యాలనిపించింది వివేక్ కి. తిరిగి సమాధానం చెబుదాం అనుకునేంతలోపె ఆకాశంలో పెద్ద మెరుపు. సరిగ్గా వీళ్ళ విమాణం మీద పిడుగు పడింది. ఆ ధాటికి వీళ్ళ విమానం మూడువేల అడుగులు కిందకి జారింది. అతికష్టమ్మీద పైలట్ విమనాన్ని తిరిగి తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. పైలట్లిద్దరు చిన్న నిట్టూర్పుతొ రెలీవ్ అయ్యారు. కాని ఆ అనందం ఎక్కువ సేపు నిలబడలేదు. విమానం ఏ.టి.సి. తొ సంబంధం కోల్పోయింది.

పైలట్లు కంగారుగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఇంతలోనే మరో పిడుగు సరిగ్గా వీళ్ళ విమానం మీద పడింది. ఆ ధాటికి విమానం ఎడం రెక్క సగానికి తెగిపోయింది. విమానం సెకనుకి వెయ్యి అడుగులు కిందకి జారిపోసాగింది.రెక్కలు తెగిన పక్షిలా గాలివాటుకి కిందకి జారడం మొదలుపెట్టింది. పైలట్లు ఇద్దరికీ ఏమి జరిగిందో అర్థం అవ్వడానికి కొద్ది సమయం పట్టింది. ఇంతలోపు విమానం అయిదు వేల అడుగులు కిందకి జారిపోయింది. విమానంలో ఉన్న ప్రయనికులంతా కంగారుగా అరవడం మొదలుపెట్టారు. ఎయిర్ హోస్టెస్ కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. పైలట్ విమానాన్ని కంట్రోల్ చెయ్యడానికి అన్ని విధాల ప్రయత్నిస్తున్నాడు. ఇంతలొ పైలట్ ముందున్న కంట్రోల్ పానెల్స్ అన్ని ఒక్కసారిగా జీవం పోసుకున్నట్టుగా అరవడం మొదలుపెట్టాయి. అది చూస్తూనే పైలట్ కి విషయం అర్థం అయ్యింది. అప్పటిదాకా ఏదో ఒక మూల మిగిలి ఉన్న ఆశ కూడా మటుమాయం అయిపొయింది. విమానానికి ఇంధనం సప్లై చేసే పైపు పిడుగు వల్ల ముక్కలు ముక్కలయింది. ఇంధనం కూడా ఎక్కువ సేపు రాదు. మహా అయితే రెండుమూడు నిముషాల్లో ఇంధనం అంట బయటికి పంప్ చేయబడుతుంది. ఇంధనం ట్యాంక్ లో ఇంధనం అత్యధిక పీడనాల వద్ద నిల్వ ఉంచబడుతుంది. అందువల్ల ఇంధనం ట్యాంక్ ఏమాత్రం బలహీనంగ ఉన్న విమానం పేలిపోతుంది. విమానంలో ఎమర్జెన్సీ వచినప్పుడు పైలట్ ఎజేక్షన్ సిస్టం ఉంటుంది. పైలట్లిద్దరూ కేవలం పదిహేను సెకండ్ల సమయంలో విమానం నించి దూరంగా విసిరేయ్యబడతారు. పైలట్లిద్దరికీ ప్రయనికులని నడిసముద్రంలో వదిలి వెళ్ళడానికి మనసు రాలేదు. అదొక్కటే కారణం కాదు. వాళ్ళు ఉన్నది నడి సముద్రం లో వాళ్ళు భూభాగం చేరడానికి ఇంకా నాలుగు వందల నాటికల్ మైళ్ళ దూరం ఉంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని రెస్కుటీం రావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. తుఫానులో నడి సముద్రంలో కేవలం పారాచుట్ల సాయం తో సముద్రంలో ఉండడం ఆత్మహత్య సదృశ్యం . చావూ ఎలాగు తప్పనప్పుడు చివరి దాక పోరాడడమే మంచిది. పైలట్లిద్దరూ అదే చేస్తున్నారు. చూస్తుండగానే భూమికి కేవలం నాలుగు వందల అడుగుల ఎత్తుకి వచ్చింది. చివరి ప్రయత్నం గ పైలట్ బలంగా విమానాన్ని కుడి వైపు కి తిప్పాడు. అద్రుష్టం బాగుండి గాలివాటుకి మరో రెండు వందల అడుగుల ఎత్తుకి లేచింది విమానం. ఆ కొద్ది అవకాశాన్ని పైలట్ సద్వినియోగం చేసుకున్నాడు.విమానం గాలి వాటుకి పైకి లేవగానే విమానాన్ని మరింత పైకి తీసుకువెళ్ళాడు. పైలట్ కి తెలుసు అది కేవలం చావుని ఆలస్యం చేయడానికి చేసే చిరు ప్రయత్నమని.అలా పైకి లేచినప్పుడు పైలట్ కి దూరంగా కొన్ని పక్షులు కనిపించాయి. సముద్రం లో ఉండే చిన్న చిన్న ద్వీపాల మీద ఆవాసం ఏర్పరుచుకుంటాయి కొన్ని చిన్న చిన్న పక్షులు. ద్వీపం నించి కేవలం పది నిమిషాల దూరంలో తిరిగుతూ ఉంటాయి. వాటిని చూడగానే పైలట్ కి బతుకుతామన్న ఆశ చిగురించింది. అదే విషయాన్నీ పబ్లిక్ అడ్డ్రేస్సింగ్ సిస్టంలో చెప్పాడు. ఆ చివరి నిమిషంలో ఎక్కువ మంది ప్రయాణికులు భయంతో బిగుసుకుపోయి ఉన్నారు. పైలట్ చెప్పిన విషయం విన్న వాళ్ళు చాల తక్కువ మంది. విమానం మరికొంత ముందుకి వెళ్లి బలంగా సముద్రాన్ని గుద్దుకుంది. నీళ్ళను తాకిన మరుక్షణం విమానం రెండు ముక్కలు అయ్యింది. విమానం లో ఉన్న ప్రయాణికులు, వాళ్ళ సామాన్లు చెల్లాచెదురుగ నీళ్ళలోకి విసిరివేయ బడ్డాయి. విమానం నీళ్ళని గుద్దోకోగానే కొంత మంది ప్రయాణికులు ఆ ధాటికి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. కొంత మంది నీళ్ళలో మునిగిపోయారు. చాల కొద్దిమంది మాత్రమే ఈదడం మొదలుపెట్టారు. విమాన శకలాలని తప్పించుకుంటూ అంతకు ముందు పైలట్ చెప్పిన వైపు ఈత మొదలుపెట్టారు బతికి ఉన్న కొద్దిమంది. అలా ద్వీపం వైపు ఈదుకుంటూ వెళ్ళిన వాళ్ళు పట్టుమని ఎనిమిది మంది కూడా లేరు. ఒడ్డుకి చేరుకున్నాక అందరు సొమ్మసిల్లి పడిపోయారు. అటువంటి ప్రమాదాన్ని వాళ్ళు జీవితంలో చూడలేదు.చూడడం వేరు ప్రమాదంలో ఉండడం వేరు. అలసటతో, భయం తో అందరికి స్పృహ తప్పిపోయింది. అలా ఎంత సేపు ఉన్నారో తెలిదు. అందరికన్నా ముందు తెలివి తెచుకున్నది జేమ్స్. లేవగానే ఒక్క క్షణం ఎక్కడున్నదీ గుర్తు రాలేదు. తరవాత మెల్లగా జరిగిందంతా నెమ్మదిగా కళ్ళ ముందు మేదిలేటప్పటికి నుదుటన చెమటలు ప్రత్యక్షమయ్యాయి. నెమ్మదిగా పరిసరాలు గమనించేటప్పటికి కొన్ని శవాలు, సామాన్లు విమాన శకలాలు కనిపించాయి. అలా ఒడ్డు వెంబడి నడవడం మొదలు పెట్టాడు. కనిపించిన ప్రతి శరీరాన్ని పరిక్షిండం మొదలు పెట్టాడు. స్వతహాగా డాక్టర్ అవ్వడం వల్ల త్వరగానే జరుగుతోంది. అలా మొత్తం మీద ఇరవయి నలుగు మృతదేహాలని పరీక్షించాడు. కేవలం ఏడు మందిని పొడి ప్రదేశానికి చేర్చాడు. సుమారుగా ఎవ్వరికి పెద్ద దెబ్బలు తగల్లేదు. నెమ్మదిగా ఒక్కొక్కరికి స్పృహ రావడం మొదలయ్యింది. జేమ్స్, ఆలేఖ్య, వివేక, లీ, మిత్ర, నాయర్, క్రిస్టినా, గ్రెగ్ మిగిలారు.