Pages

Sunday, December 12, 2010

మాయ - 3

గంట సేపటి తరవాత శశాంక్ ని సాగనంపడానికి వచ్చిన సులేమాన్ సునిశిత దృష్టిలో పడనే పడింది C.I.A. ఏజెంట్స్ కూర్చున్న కాడిలాక్. చిన్న నవ్వు నవ్వుకుని శశాంక్ కార్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. అరనిమిషం పాటు చూసి మళ్లి లోపలి వచ్చేసాడు. వస్తూ వస్తూనే వడివడిగా తన బెడ్ రూమ్లోకి వెళ్లి తలుపు వేసేశాడు. గదిలో ఎవ్వరు లేరు అని రూడీ చేసుకున్నాక గోడకున్న అద్దం దగ్గరికి నడిచాడు. ఏడడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న వన్ సైడ్ మిర్రర్ అది. సాధారణంగా వన్ సైడ్ మిర్రర్స్ ని చాల తేలికగా గుర్తు పట్తోచు. అద్దం మీద మన వేలు పెడితే ప్రతిబింబానికి వేలికి మధ్యలో గ్యాప్ ఉండదు. అదే సాధారణమైన అద్దం అయితే వేలికి ప్రతిబింబానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. కానీ సులేమాన్ గదిలో ఉన్న అద్దం ప్రత్యేకంగా ఇరాన్ ఇంటలిజెన్స్ తాయారు చేసిన అద్దం. మాములు అద్దానికి దీనికి ఏమాత్రం తేడ లేకుండా చేసారు. సులేమాన్ అతి రహస్యంగా ఇంస్టాల్ చేసిన ఒక బటన్ నొక్కగానే అద్దం పక్కకి జరిగి వెనకాల ఉన్న గది ప్రత్యక్షం అయ్యింది. ఆ గదిలో ఒక అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్, అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ పానెల్ ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి తాయారు కమ్యూనికేషన్ పానెల్ అది. దానికున్న స్క్రామ్బ్లేర్స్ ని బ్రేక్ చెయ్యడం దాదాపు అసంభవం. అమెరికన్ శాటిలైట్లకి దొరక్కుండా డిజైన్ చెయ్యబడింది అది.
సులేమాన్ అది ఆన్ చేసి తన కోడ్ చెప్పగానే ఆటోమాటిక్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది.
“టైగర్ రిపోర్టింగ్ టు హోం.” అన్నాడు సులేమాన్.
“హోం రీడింగ్. ప్రొసీడ్ టైగర్”
“ఎ వెరీ ఇన్నోవేటివ్ అండ్ పొటెన్షియల్ వెపన్ ఇన్ ప్రొగ్రెస్స్ బై హైనాస్. కాంటాక్ట్ మేడ్. విల్ కీప్ రీడింగ్. ఓవర్ అండ్ అవుట్”
ఎంతో సంక్షిప్తంగా ఉన్న మెసేజ్ అది. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి ఇరాన్ మిలిటరికి పంపించిన మెసేజ్. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి సులేమాన్ కి మొత్తం డీటెయిల్స్ చెప్పకపోయినా శశాంక్ అడిగిన కొన్ని ప్రశ్నల ద్వార సులేమాన్ మొత్తం గ్రహించేసాడు. శశాంక్ ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టే చెప్పి శశాంక్ తనతోటి రెగ్యులర్ టచ్ లో ఉండేలా కధని నడిపించాడు.

Wednesday, October 13, 2010

మాయ - 2

ఈ-మెయిల్ చెక్ చేస్తున్న శశాంక్ పెదవులమీద చిన్న చిరునవ్వు మెరిసింది. ఈ రిపోర్ట్ గురించే తను ఇన్ని రోజులు శ్రమ పడింది. మనిషి మేధస్సుని కంప్యుటర్ కి అనుసంధానించే ఇంటర్ఫేస్ కి తను గత ఆరు నెలలుగా కష్టపడి తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టం టెస్ట్ రిజల్ట్స్ అవి. మొత్తం ప్రాజెక్ట్ కి ఎంతో కీలకమైన అపెరేటింగ్ సిస్టం “మాయ” తయారయింది. ఇంకా మిగిలినదల్ల హార్డువేర్ తాయారు చేసి దాన్ని వాడడమే. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం అవ్వడం తో శశాంక్ తను చూస్తున్న ఈ-మెయిల్స్ ని వెంటనే క్లోజ్ చేసి లాప్ టాప్ ని లాక్ చేసి
“Who is it?” అని అడిగాడు. బాయ్ వచ్చి కాఫీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుదమనుకుంటూ ఉండగా హోటల్ రిసెప్షన్ నించి ఫోన్ వచ్చింది. కింద తన కోసం కార్ వెయిట్ చేస్తోందని. అప్పుడు గాని గుర్తురాలేదు శశాంక్ కి ముందు రోజు Dr. సులేమాన్ ని కలుద్దామని తీసుకున్న అప్పాయింట్మెంట్. Dr. సులేమాన్ ఇరాన్ లో ఎంతో పేరు గాంచిన వ్యక్తీ. “Robotics and Aritificial Intelligence” మీద కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి ఇరాన్ మిలిటరీ కి కొన్ని సంబంధాలు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే, సులేమాన్ రోబోటిక్స్ లో ఉద్దండుడు. శశాంక్ కి తన “మాయ” గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చుకుందామని సులేమాన్ దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. తన మతిమరుపుకి తననే తిట్టుకుంటూ హడావిడిగా బయలుదేరి కారులో కూర్చున్నాడు. శశాంక్ కూర్చున్న బి.ఎం.డబ్ల్యు. వంద మీటర్లు కూడా వెళ్లక ముందే ఒక నల్లటి కాడిలాక్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. కాడిలాక్ ని నడుపుతున్న వ్యక్తీ ప్రొఫెషనల్ అనుకుంట. శశాంక్ కార కి తన కార కి మధ్య కనీసం నాలుగు బండ్లు ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ నడుపుతున్నాడు.
అరగంట తరవాత బోస్టన్ తీరంలో ఉన్న ఒక విల్ల ముందు ఆగింది. అక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ అయ్యాక బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ బి.ఎం.డబ్ల్యు ని లోపలి పంపాడు. ఆ రోడ్ కి అదే డెడ్ ఎండ్. కార లోంచి దిగగానే సులేమాన్ సాదరంగా ఎదురు వచ్చి శశాంక్ ని పొదివి పట్టుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేన్స్ రంగంలో శశాంక్ సాధిస్తున్న పురోగతి సులేమాన్ కి తెలియనిది కాదు. అందుకే శశాంక్ అడిగిన వెంటనే తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి శశాంక్ ని కలిసాడు. సులేమాన్ ఉన్నది ఇరాన్ గవర్నమెంట్ కి చెందిన గెస్ట్ హౌస్. ఎంతో కట్టుదిట్టమైన భద్రత లో ఉంది. తన పౌరులని అమెరికా పంపేటప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. అందులోను సులేమాన్ వంటి సైంటిస్ట్ ని పంపడం ఇరాన్ ప్రభుత్వానికి ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అందుకే సులేమాన్ కి కట్టుదిట్టమైన భద్రతా కలిపించింది. పరస్పర అభినందనల తరువాత శశాంక్, సులేమాన్ ఇద్దరు విల్ల లోపలికి నడిచారు.
C.I.A. కి సంబంధించిన కాడిలాక్ రెండు నిమిషాల తరవాత నిశబ్దంగా వచ్చి బంగ్లకి కొంచెం దూరంలో ఆగింది. నల్లని అద్దాల వెనుక ఉన్న వ్యక్తీ ఎప్పటికప్పుడు బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేస్తున్నాడు. సులేమాన్ లాంటి వ్యక్తీ అమెరికాకి వచినప్పుడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎం చేస్తున్నాడు అన్న సంగతి కనిపెట్ట్టడానికి అమెరికా లాంటి దేశం ఎప్పుడు అలెర్ట్ గ ఉంటుంది.

Tuesday, July 20, 2010

మాయ - 1

మాయ
2003 26th September...
“Learning provides thinking! Thinking provides knowledge! Knowledge makes you great!"
టి.వి లో వస్తున్న ప్రసంగాన్ని వింటున్న పదిహేనేళ్ళ శశాంక్ ని చూసి మురిసిపోయింది వాళ్ళ అమ్మ. నెల్లూరు దగ్గరలోని శ్రీహరి కోట దగ్గరలోని చిన్న పల్లెటూరులో అతి సాధారణమయిన కుటుంబం వాళ్లది. అటువంటి చిన్న పల్లెటూరి నించి ఐ. ఐ.టి. ఖరగ్పూర్ లో కేవలం పన్నెండేళ్ళ వయసులోనే సీట్ సాధించిన శశాంక్ ని చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు. అవును. శశాంక్ కేవలం తొమ్మిదేళ్ళ వయసులో టెన్త్ పరిక్షలు రాసి నెల్లూరు లో టాప్ వచ్చాడు. మరో ఏడాదికి ఐ.ఐ.టి లో సీట్ వచ్చింది. అక్కడ కూడా విత్ స్పెషల్ రికమెండేషన్, నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్స్ కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అక్కడే మాస్టర్స్ చేస్తున్నాడు. నాసా ప్రతి ఏడాది నిర్వహించే యంగ్ మైండ్స్ ప్రోగ్రాం కి ఇండియా తరఫున పాల్గొన్నాడు. చిన్న తనం నించి శార్ ని దగ్గర నించి చూడడం తో Dr. A.P.J అబ్దుల్ కలాం గారు అంటే చెప్పలేని అభిమానం. ఆయనని స్ఫూర్తి గ తీసుకున్నాడు.
1
2015, January 1st
న్యూరల్ నెట్వర్క్ మీద M.I.T లో జరుగుతున్న కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్న వాళ్ళలో అతి పిన్న వయస్కుడు, ఏకైక భారతీయుడు Dr. శశాంక్. కేవలం ఇరవయ్ సంవత్సరాల వయసులో M.I.T లో థిసిస్ సబ్మిట్ చేసి శశాంక్, డాక్టర్ శశాంక్ అయిపోయాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేంస్ మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళలో ప్రముఖమైన వాళ్ళలో శశాంక్ ఒకడు.
కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే తన హోటెల్ గదికి వచ్చేసాడు. వచ్చి రావడంతోనే తన టీం ఇండియా నించి పంపిన ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. అతను అతి రహస్యంగా చేస్తున్న రిసెర్చ్ రిపోర్ట్స్ అవి.
శశాంక్ చేస్తున్న రిసెర్చ్ కనక ఒక రూపు దాలిస్తే మనిషి బుద్ధి జీవి అన్న నానుడి సాకారం అవుతుంది.
కంప్యూటర్ మొదట కనిపెట్టినప్పుడు ఒక సారి ఒక పని మాత్రమె చేయ్యగాలిగేవి. నెమ్మదిగా వాటిని ఒకేసారి చాల పనులు చేసేతట్టుగా అభివృద్ధి పరిచారు. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ కేవలం ఒక మిల్లి సెకండ్ లో దాని ప్రాసెసర్ ఎన్ని ఆపరేషన్స్ చెయ్యగలదు అన్నదాన్ని బట్టి నిర్ణయిస్తారు. శశాంక్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ రూపొందించడానికి ఒక అప్ప్రోచ్ కనిపెట్టాడు. అదే మనిషి. ఒక మనిషి మెదడు ఒకే సమయంలో చాలా పనులు చెయ్యగలదు. సరిగ్గా ఉపయోగిస్తే మనిషి మెదడు ఒక విషయాన్నీ విశ్లేషించే సమయం అదే విషయాన్నీ ఒక కంప్యూటర్ విశ్లేషించ సమయం కన్నా తక్కువ పడుతుంది. ఇది ఎన్నో సార్లు చెస్ ప్లేయర్స్ విషయంలో నిరూపించా బడింది. ఈ విశ్లేషణ శక్తిని సూపర్ కంప్యూటర్ తో అనుసంధానం చేస్తే ఒక మైక్రో ప్రాసెసర్ చేసే పనిని మనుషులే అతి తేలికగా చేయ్యగాలుగుతారు. ఇప్పుడు సైబర్ సెంటర్స్ ఉన్నట్లు కంప్యూటింగ్ సెంటర్స్ ని దేశ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేస్తే చదువు సంధ్యలతో పనిలేకుండా ప్రతి మనిషి తన సమయాన్ని కేటాయించి సూపర్ కంప్యూటింగ్ క్లౌడ్ కి కనెక్ట్ అయితే చాలు. శశాంక్ అప్ప్రోచ్ లో ఉన్న లాభం ఏమిటంటే, మనిషికి స్వతహాగా తెలివి తేటలు ఉన్నాయి కనక, మొదటి సరి వచ్చిన వ్యక్తీ విశ్లేషణ శక్తి కన్నా రెండో సరి, మూడో సరి వచ్చే వ్యక్తీ విశ్లేషణ శక్తి ఎక్కువ ఉంటుంది. దీని వాళ్ళ కంప్యూటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా సామాజికంగా ప్రతి వ్యక్తీ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా, ఆర్ధికంగా దేశానికి ఎంతో ఉపయోగం. ప్రతి మనిషి మేధావి అవుతాడు. ఇప్పుడు భారత దేశం ఎదురుకుంటున్న మేధో వలస ఉండదు. మొత్తం ప్రపంచానికి ఇండియా విల్ బికం ఎ సెంటర్ అఫ్ ఇంటలిజెన్స్. శశాంక్ చేస్తున్న రిసెర్చ్ అంతా మనిషి మేధో శక్తి ని ఒక సూపర్ కంప్యూటర్ తో అనుసంధానిచే ప్రోసెస్ మీద. అది కూడా కార్య రూపం దాల్చే రోజు ఎంతో దూరం లో లేదు. మరొక రెండేళ్లలో ప్రపంచ పటం మీద భారత దేశ ముఖ చిత్రం మార్చాలన్నది శశాంక్ ఆశయం. ఈ రిసెర్చ్ అంతా ఢిల్లీ అవుట్ స్కర్త్స్లోని ఒక రహస్య ప్రదేశంలో జరుగుతోంది. ఈ రిసెర్చ్ గురించి తెలిసింది కేవలం నలుగురు వ్యక్తులకే. శశాంక్ , ప్రొఫెసర్ చక్రపాణి, ఆర్మీ చీఫ్ జనరల్ కరియప్ప అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (IIAC) చైర్మన్ డాక్టర్. షణ్ముగం. వీళ్ళు నలుగురు ప్రతి నెల అతి రహస్యంగా కలుసుకుని రిసెర్చ్ ప్రొగ్రెస్స్ ని అనలైజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి పెట్టుకున్న కోడ్ నేమ్ “మాయ“

Saturday, January 30, 2010

అసుర సంధ్య పార్ట్ - 6

క్రిస్టినాతో వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా, లీ చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా విగ్రహం ఉండవలసిన చోటికి వచ్చి వెతకసాగాడు. గ్రెగ్ కదిపిన రాయి తేలికగానే గుర్తుపట్టాడు. దాని పక్కనే ఏదో శాసనం లాంటిది కనిపించింది. అది తీసుకుని మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చి, “ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు. పదండి వెళ్లి పోదాం.” అన్నాడు. అందరు కలిసి బయటికి వచ్చేసారు. వస్తు వస్తూ, లీ, వివేక్ కొన్ని బంగారు గుండ్లు తీసుకు వచ్చారు. వాటి వంక చూస్తున్న జేమ్స్ తో “మనం అనుభవించిన దానికి ఎంతో కొంత ప్రతిఫలం తీసుకుని వెళ్దాం” అన్నాడు వివేక్. అందరు కలిసి గ్రెగ్ అంతకు ముందు దాచిన స్పీడ్ బోటు దగ్గరికి వచ్చారు. కొంతసేపట్లోనే సముద్రపు అలల మీదుగా దగ్గరలోని తీరానికి బయలుదేరారు.
*********
కొంత సేపటికి అమెరికా మరైన్స్ కి చెందిన ఒక బోటు కనిపించింది. వీళ్ళని తమ బోటు లోకి ఎక్కించుకొని మియామి వైపు బయలుదేరాయి. తరవాత కొన్ని రోజులు వీళ్ళకి చాల హడావిడిగ గడిచిపోయాయి. అమెరికన్ ఆర్మీ, నావి కలిసి వీళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ గుహని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ గ్రెగ్ శవం తప్ప ఇంకేమి దొరకలేదు. నాయర్ బాడీ ని ఇండియా కి పంపించేసారు. ఇంటర్ పోల్ కి గ్రెగ్ ఆనవాళ్ళు పంపించారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తీ గ్రెగ్ అని నిర్ధారించుకుని గ్రెగ్ ఫైల్ క్లోజ్ చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్కియాలజిస్ట్లు అందరు ఆ ద్వీపానికి బయలుదేరారు. అక్కడ ఉన్న బంగారాన్ని అమెరికన్ ప్రభుత్వం స్వాధీనం పరుచుకుని, క్రిస్టిన, లీ, జేమ్స్, స్వదేశాలకి , ఇండియా కి వాటాలు పంచింది. వివేక్ ఆలేఖ్య పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కొన్ని వారల పటు, వివేక్ ఆలేఖ్య అర్కేయలజి సేమినర్స్ ఇవ్వడంలో మునిగిపోయారు.

ఆరు నెలల తరవాత..........
వివేక్ ఆలేఖ్య కొంచెం తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో వివేక్ ఏదో గుర్తుకు వచినట్టు లేచి హడావిడిగా లోపలి వెళ్లి వెతకడం మొదలు పెట్టాడు. తనకి కావాల్సిన వస్తువు దొరికాక బయటికి వచ్చాడు. గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు లీ తీసుకుని వచ్చిన శాసనం. వివేక్ ఆలేఖ్య దాని సంగతే మర్చిపోయారు. ఇద్దరు కూర్చుని చదవడం మొదలుపెట్టారు.


*********
క్రీస్తు శకం 700 మొదట్లో మాయ నాగరికత ఉచ్ఛ స్థితి లో ఉంది. యిక్’ఇన్ చన్ కే’అవియిల్ అనే రాజు తికల్ అనే రాజ్యాన్ని పాలించేవాడు. అతను పరాక్రమవంతుడు. అతని పాలనలోనే తికల్ రాజ్యం పెద్ద విపణిగ మారింది. సుదూర ప్రాంతాల నించి వర్తకులు తికల్ నగరానికి వచ్చి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు. టోతిహుఅకాన్ (నేటి మెక్సికో దేశం లోని మెక్సికన్ వ్యాలి ) నించి కూడా వచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు. కే’అవియిల్ పాలనలోనే తికల్ తన పొరుగున ఉన్న కాలక్ముల్ అనే రాజ్యాన్ని దాని మరో రెండు అనుబంధ రాజ్యాలని జయించింది. ఆ విజయానికి గుర్తుగానే యిక్’ఇన్ చన్ కే’అవియిల్ తికల్ పొలిమేరల్లో పెద్ద విజయ స్తూపం స్థాపించాడు. కలక్ముల్ రాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని గురించి వెతికించి, అధరాలు దొరకక చనిపోయినట్టు ప్రకటించాడు. కొన్నాళ్ళకి అతని గురించి మర్చిపోయాడు. కానీ కలక్ముల్ని కోల్పోయిన యుక్నూం ఉత్తినే కూర్చోలేదు. ఎలాగో తప్పించుకుని ఈ ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడి మంత్రికుడిని ఒప్పించి ఎన్నో క్షుద్ర శక్తులని తయారుచేయించాడు. ఒక రోజున ఆ క్షుద్రశాక్తులన్నితిని తికల్ రాజ్యం మీదకి ఉసిగొల్పాడు. ఆ రోజుతో తికల్ రాజ్యం అంతర్ధానం అయిపొయింది. తిరిగి వచ్చిన క్షుద్రశాక్తులని మాంత్రికుడు నిద్రాణపరిచి వాటిని నిబిరు అనే గ్రహం మీద నిక్షిప్తం చేసాడు. వాటిని తిరిగి మేల్కొపితే కేవలం అతని మాటకే కట్టుబడి ఉంటాయి. వాటిని తిరిగి రప్పించటానికి వీలుగా, ఇక్కడ ఒక క్షుద్రజీవిని తాయారు చేసాడు. ఈ క్షుద్రజీవి నిబిరు గ్రహం మీద ఉన్న మిగిలిన క్షుద్ర శక్తులని భూమికి రాప్పించాగలదు.
********
చదవడం అయిపోయాక వివేక్, ఆలేఖ్య మొహాలు చూసుకున్నారు. మాయ క్యాలెండర్ ప్రకారం 2012 భూమికి ఏదో పెద్ద ఉపద్రవం వస్తుంది అని ఉంది. ఆ విషయం మీద ఎన్నో పుకార్లు, సినిమాలు వచ్చాయి. అవి అన్ని కేవలం అభూత కల్పనలు అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇన్ని రోజులు వివేక్ ఆలేఖ్య కూడా అలానే అనుకున్నారు. ఉపద్రవం వస్తుంది అని మాయ శాసనాలు చాల వాటిలో ఉంది కానీ ఏ రూపంలో వస్తుందో ఎక్కడ సరిగ్గా చెప్పలేదు. ఆలేఖ్య భయంగ “వివేక్! అయితే మనం ఆ ఉపద్రవాన్ని ట్రిగ్గర్ చేసామ?” అని అడిగింది. దానికి సమాధానంగా ప్రకృతి వెంటనే స్పందించింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘవ్రుతమయిపోయింది. ఒక పెద్ద పిడుగు వీళ్ళు ఉన్న చోటికి కొంత దూరంలోని ఒక చెట్టు మీద పడింది. మరుక్షణం అక్కడ ఒక బూడిద కుప్ప తప్ప ఇంకేమి మిగలలేదు. ఆలేఖ్య కి ఆరు నెలల ముందు లండన్ నించి చికాగో ఫ్లైట్ లో తనకి వచ్చిన కల గుర్తుకువచింది.
-X-X-X-X-X-X-X-