Pages

Monday, September 9, 2013

మర్కట - కిషోర న్యాయం మార్జాల - కిషోర న్యాయం


అనుబంధాలు రెండు రకాలు. మర్కట - కిషోర న్యాయం మార్జాల - కిషోర న్యాయం .
మర్కట - కిషోర న్యాయం :- కోతి తన పిల్లలని ఒక చోటి నించి మరో చోటికి తీసుకు వెళ్ళేటప్పుడు కోటి పిల్ల తల్లి కోతి పొట్టని గట్టిగ పట్టుకుని ఉంటుంది . ఇక్కడ పట్టుకోవలసిన బాధ్యత పిల్లది తప్ప తల్లిది కాదు.
మార్జాల-కిషోర న్యాయం :- పిల్లి తన పిల్లలని ఒక చోట నించి మరో చోటికి ఒక దాని తరవాత ఒక పిల్లని జాగ్రత్తగా నోట కరిచి తీసుకు వెళ్తుంది . ఇక్కడ పిల్లని మోయాల్సిన బాధ్యత తల్లిది కానీ పిల్లది కాదు .
ఇక్కడ ఏది మంచిది ఏది చెడ్డది అన్న వాదన కాని పోలిక కానీ అక్కర్లేదు. సృష్టి ధర్మం ప్రకారం రెండు న్యాయాలు సరి అయినవె. సమయానుకూలంగా ఆ ఆ ధర్మాన్ని పాటిస్తే ఎటువంటి అనుబంధమైన కలకాలం నిలిచి ఉంటుంది.

There are two types of relationships in this world.
Monkey-Infant:- The infant holds the responsibility of being with her mother when moving from one place to other.
Cat-Kitten:- The mother holds the responsibility of keeping the kitten safe when moving from one place to other.
In any relationship, if one of the above two is selected wisely, the relationship will withstand the tests of time.

Sunday, December 12, 2010

మాయ - 3

గంట సేపటి తరవాత శశాంక్ ని సాగనంపడానికి వచ్చిన సులేమాన్ సునిశిత దృష్టిలో పడనే పడింది C.I.A. ఏజెంట్స్ కూర్చున్న కాడిలాక్. చిన్న నవ్వు నవ్వుకుని శశాంక్ కార్ వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయాడు. అరనిమిషం పాటు చూసి మళ్లి లోపలి వచ్చేసాడు. వస్తూ వస్తూనే వడివడిగా తన బెడ్ రూమ్లోకి వెళ్లి తలుపు వేసేశాడు. గదిలో ఎవ్వరు లేరు అని రూడీ చేసుకున్నాక గోడకున్న అద్దం దగ్గరికి నడిచాడు. ఏడడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న వన్ సైడ్ మిర్రర్ అది. సాధారణంగా వన్ సైడ్ మిర్రర్స్ ని చాల తేలికగా గుర్తు పట్తోచు. అద్దం మీద మన వేలు పెడితే ప్రతిబింబానికి వేలికి మధ్యలో గ్యాప్ ఉండదు. అదే సాధారణమైన అద్దం అయితే వేలికి ప్రతిబింబానికి కొంచెం గ్యాప్ ఉంటుంది. కానీ సులేమాన్ గదిలో ఉన్న అద్దం ప్రత్యేకంగా ఇరాన్ ఇంటలిజెన్స్ తాయారు చేసిన అద్దం. మాములు అద్దానికి దీనికి ఏమాత్రం తేడ లేకుండా చేసారు. సులేమాన్ అతి రహస్యంగా ఇంస్టాల్ చేసిన ఒక బటన్ నొక్కగానే అద్దం పక్కకి జరిగి వెనకాల ఉన్న గది ప్రత్యక్షం అయ్యింది. ఆ గదిలో ఒక అడ్వాన్స్డ్ ప్రొజెక్టర్, అత్యంత ఆధునికమైన కమ్యూనికేషన్ పానెల్ ఉన్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఎంతో ఖర్చుపెట్టి తాయారు కమ్యూనికేషన్ పానెల్ అది. దానికున్న స్క్రామ్బ్లేర్స్ ని బ్రేక్ చెయ్యడం దాదాపు అసంభవం. అమెరికన్ శాటిలైట్లకి దొరక్కుండా డిజైన్ చెయ్యబడింది అది.
సులేమాన్ అది ఆన్ చేసి తన కోడ్ చెప్పగానే ఆటోమాటిక్గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది.
“టైగర్ రిపోర్టింగ్ టు హోం.” అన్నాడు సులేమాన్.
“హోం రీడింగ్. ప్రొసీడ్ టైగర్”
“ఎ వెరీ ఇన్నోవేటివ్ అండ్ పొటెన్షియల్ వెపన్ ఇన్ ప్రొగ్రెస్స్ బై హైనాస్. కాంటాక్ట్ మేడ్. విల్ కీప్ రీడింగ్. ఓవర్ అండ్ అవుట్”
ఎంతో సంక్షిప్తంగా ఉన్న మెసేజ్ అది. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి ఇరాన్ మిలిటరికి పంపించిన మెసేజ్. శశాంక్ చేస్తున్న రేసేఅర్చ్ గురించి సులేమాన్ కి మొత్తం డీటెయిల్స్ చెప్పకపోయినా శశాంక్ అడిగిన కొన్ని ప్రశ్నల ద్వార సులేమాన్ మొత్తం గ్రహించేసాడు. శశాంక్ ప్రశ్నలకి సమాధానం చెప్పినట్టే చెప్పి శశాంక్ తనతోటి రెగ్యులర్ టచ్ లో ఉండేలా కధని నడిపించాడు.

Wednesday, October 13, 2010

మాయ - 2

ఈ-మెయిల్ చెక్ చేస్తున్న శశాంక్ పెదవులమీద చిన్న చిరునవ్వు మెరిసింది. ఈ రిపోర్ట్ గురించే తను ఇన్ని రోజులు శ్రమ పడింది. మనిషి మేధస్సుని కంప్యుటర్ కి అనుసంధానించే ఇంటర్ఫేస్ కి తను గత ఆరు నెలలుగా కష్టపడి తయారుచేసిన ఆపరేటింగ్ సిస్టం టెస్ట్ రిజల్ట్స్ అవి. మొత్తం ప్రాజెక్ట్ కి ఎంతో కీలకమైన అపెరేటింగ్ సిస్టం “మాయ” తయారయింది. ఇంకా మిగిలినదల్ల హార్డువేర్ తాయారు చేసి దాన్ని వాడడమే. ఇంతలో ఎవరో డోర్ నాక్ చేసిన శబ్దం అవ్వడం తో శశాంక్ తను చూస్తున్న ఈ-మెయిల్స్ ని వెంటనే క్లోజ్ చేసి లాప్ టాప్ ని లాక్ చేసి
“Who is it?” అని అడిగాడు. బాయ్ వచ్చి కాఫీ సర్వ్ చేసి వెళ్ళిపోయాడు. కాఫీ తాగి కొంచెం రిలాక్స్ అవుదమనుకుంటూ ఉండగా హోటల్ రిసెప్షన్ నించి ఫోన్ వచ్చింది. కింద తన కోసం కార్ వెయిట్ చేస్తోందని. అప్పుడు గాని గుర్తురాలేదు శశాంక్ కి ముందు రోజు Dr. సులేమాన్ ని కలుద్దామని తీసుకున్న అప్పాయింట్మెంట్. Dr. సులేమాన్ ఇరాన్ లో ఎంతో పేరు గాంచిన వ్యక్తీ. “Robotics and Aritificial Intelligence” మీద కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు. అతనికి ఇరాన్ మిలిటరీ కి కొన్ని సంబంధాలు ఉన్నాయని పుకార్లు ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడితే, సులేమాన్ రోబోటిక్స్ లో ఉద్దండుడు. శశాంక్ కి తన “మాయ” గురించి కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చుకుందామని సులేమాన్ దగ్గర అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. తన మతిమరుపుకి తననే తిట్టుకుంటూ హడావిడిగా బయలుదేరి కారులో కూర్చున్నాడు. శశాంక్ కూర్చున్న బి.ఎం.డబ్ల్యు. వంద మీటర్లు కూడా వెళ్లక ముందే ఒక నల్లటి కాడిలాక్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది. కాడిలాక్ ని నడుపుతున్న వ్యక్తీ ప్రొఫెషనల్ అనుకుంట. శశాంక్ కార కి తన కార కి మధ్య కనీసం నాలుగు బండ్లు ఉండేటట్టుగా జాగ్రత్త పడుతూ నడుపుతున్నాడు.
అరగంట తరవాత బోస్టన్ తీరంలో ఉన్న ఒక విల్ల ముందు ఆగింది. అక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ అయ్యాక బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ బి.ఎం.డబ్ల్యు ని లోపలి పంపాడు. ఆ రోడ్ కి అదే డెడ్ ఎండ్. కార లోంచి దిగగానే సులేమాన్ సాదరంగా ఎదురు వచ్చి శశాంక్ ని పొదివి పట్టుకున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేన్స్ రంగంలో శశాంక్ సాధిస్తున్న పురోగతి సులేమాన్ కి తెలియనిది కాదు. అందుకే శశాంక్ అడిగిన వెంటనే తన బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి శశాంక్ ని కలిసాడు. సులేమాన్ ఉన్నది ఇరాన్ గవర్నమెంట్ కి చెందిన గెస్ట్ హౌస్. ఎంతో కట్టుదిట్టమైన భద్రత లో ఉంది. తన పౌరులని అమెరికా పంపేటప్పుడు ఇరాన్ ప్రభుత్వం ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. అందులోను సులేమాన్ వంటి సైంటిస్ట్ ని పంపడం ఇరాన్ ప్రభుత్వానికి ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అందుకే సులేమాన్ కి కట్టుదిట్టమైన భద్రతా కలిపించింది. పరస్పర అభినందనల తరువాత శశాంక్, సులేమాన్ ఇద్దరు విల్ల లోపలికి నడిచారు.
C.I.A. కి సంబంధించిన కాడిలాక్ రెండు నిమిషాల తరవాత నిశబ్దంగా వచ్చి బంగ్లకి కొంచెం దూరంలో ఆగింది. నల్లని అద్దాల వెనుక ఉన్న వ్యక్తీ ఎప్పటికప్పుడు బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేస్తున్నాడు. సులేమాన్ లాంటి వ్యక్తీ అమెరికాకి వచినప్పుడు ఎవరెవరిని కలుస్తున్నాడు ఎం చేస్తున్నాడు అన్న సంగతి కనిపెట్ట్టడానికి అమెరికా లాంటి దేశం ఎప్పుడు అలెర్ట్ గ ఉంటుంది.

Tuesday, July 20, 2010

మాయ - 1

మాయ
2003 26th September...
“Learning provides thinking! Thinking provides knowledge! Knowledge makes you great!"
టి.వి లో వస్తున్న ప్రసంగాన్ని వింటున్న పదిహేనేళ్ళ శశాంక్ ని చూసి మురిసిపోయింది వాళ్ళ అమ్మ. నెల్లూరు దగ్గరలోని శ్రీహరి కోట దగ్గరలోని చిన్న పల్లెటూరులో అతి సాధారణమయిన కుటుంబం వాళ్లది. అటువంటి చిన్న పల్లెటూరి నించి ఐ. ఐ.టి. ఖరగ్పూర్ లో కేవలం పన్నెండేళ్ళ వయసులోనే సీట్ సాధించిన శశాంక్ ని చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు. అవును. శశాంక్ కేవలం తొమ్మిదేళ్ళ వయసులో టెన్త్ పరిక్షలు రాసి నెల్లూరు లో టాప్ వచ్చాడు. మరో ఏడాదికి ఐ.ఐ.టి లో సీట్ వచ్చింది. అక్కడ కూడా విత్ స్పెషల్ రికమెండేషన్, నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్స్ కేవలం రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి అక్కడే మాస్టర్స్ చేస్తున్నాడు. నాసా ప్రతి ఏడాది నిర్వహించే యంగ్ మైండ్స్ ప్రోగ్రాం కి ఇండియా తరఫున పాల్గొన్నాడు. చిన్న తనం నించి శార్ ని దగ్గర నించి చూడడం తో Dr. A.P.J అబ్దుల్ కలాం గారు అంటే చెప్పలేని అభిమానం. ఆయనని స్ఫూర్తి గ తీసుకున్నాడు.
1
2015, January 1st
న్యూరల్ నెట్వర్క్ మీద M.I.T లో జరుగుతున్న కాన్ఫరెన్స్ లో ప్రసంగిస్తున్న వాళ్ళలో అతి పిన్న వయస్కుడు, ఏకైక భారతీయుడు Dr. శశాంక్. కేవలం ఇరవయ్ సంవత్సరాల వయసులో M.I.T లో థిసిస్ సబ్మిట్ చేసి శశాంక్, డాక్టర్ శశాంక్ అయిపోయాడు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటేల్లిజేంస్ మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళలో ప్రముఖమైన వాళ్ళలో శశాంక్ ఒకడు.
కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే తన హోటెల్ గదికి వచ్చేసాడు. వచ్చి రావడంతోనే తన టీం ఇండియా నించి పంపిన ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. అతను అతి రహస్యంగా చేస్తున్న రిసెర్చ్ రిపోర్ట్స్ అవి.
శశాంక్ చేస్తున్న రిసెర్చ్ కనక ఒక రూపు దాలిస్తే మనిషి బుద్ధి జీవి అన్న నానుడి సాకారం అవుతుంది.
కంప్యూటర్ మొదట కనిపెట్టినప్పుడు ఒక సారి ఒక పని మాత్రమె చేయ్యగాలిగేవి. నెమ్మదిగా వాటిని ఒకేసారి చాల పనులు చేసేతట్టుగా అభివృద్ధి పరిచారు. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ కేవలం ఒక మిల్లి సెకండ్ లో దాని ప్రాసెసర్ ఎన్ని ఆపరేషన్స్ చెయ్యగలదు అన్నదాన్ని బట్టి నిర్ణయిస్తారు. శశాంక్ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ రూపొందించడానికి ఒక అప్ప్రోచ్ కనిపెట్టాడు. అదే మనిషి. ఒక మనిషి మెదడు ఒకే సమయంలో చాలా పనులు చెయ్యగలదు. సరిగ్గా ఉపయోగిస్తే మనిషి మెదడు ఒక విషయాన్నీ విశ్లేషించే సమయం అదే విషయాన్నీ ఒక కంప్యూటర్ విశ్లేషించ సమయం కన్నా తక్కువ పడుతుంది. ఇది ఎన్నో సార్లు చెస్ ప్లేయర్స్ విషయంలో నిరూపించా బడింది. ఈ విశ్లేషణ శక్తిని సూపర్ కంప్యూటర్ తో అనుసంధానం చేస్తే ఒక మైక్రో ప్రాసెసర్ చేసే పనిని మనుషులే అతి తేలికగా చేయ్యగాలుగుతారు. ఇప్పుడు సైబర్ సెంటర్స్ ఉన్నట్లు కంప్యూటింగ్ సెంటర్స్ ని దేశ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేస్తే చదువు సంధ్యలతో పనిలేకుండా ప్రతి మనిషి తన సమయాన్ని కేటాయించి సూపర్ కంప్యూటింగ్ క్లౌడ్ కి కనెక్ట్ అయితే చాలు. శశాంక్ అప్ప్రోచ్ లో ఉన్న లాభం ఏమిటంటే, మనిషికి స్వతహాగా తెలివి తేటలు ఉన్నాయి కనక, మొదటి సరి వచ్చిన వ్యక్తీ విశ్లేషణ శక్తి కన్నా రెండో సరి, మూడో సరి వచ్చే వ్యక్తీ విశ్లేషణ శక్తి ఎక్కువ ఉంటుంది. దీని వాళ్ళ కంప్యూటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా సామాజికంగా ప్రతి వ్యక్తీ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా, ఆర్ధికంగా దేశానికి ఎంతో ఉపయోగం. ప్రతి మనిషి మేధావి అవుతాడు. ఇప్పుడు భారత దేశం ఎదురుకుంటున్న మేధో వలస ఉండదు. మొత్తం ప్రపంచానికి ఇండియా విల్ బికం ఎ సెంటర్ అఫ్ ఇంటలిజెన్స్. శశాంక్ చేస్తున్న రిసెర్చ్ అంతా మనిషి మేధో శక్తి ని ఒక సూపర్ కంప్యూటర్ తో అనుసంధానిచే ప్రోసెస్ మీద. అది కూడా కార్య రూపం దాల్చే రోజు ఎంతో దూరం లో లేదు. మరొక రెండేళ్లలో ప్రపంచ పటం మీద భారత దేశ ముఖ చిత్రం మార్చాలన్నది శశాంక్ ఆశయం. ఈ రిసెర్చ్ అంతా ఢిల్లీ అవుట్ స్కర్త్స్లోని ఒక రహస్య ప్రదేశంలో జరుగుతోంది. ఈ రిసెర్చ్ గురించి తెలిసింది కేవలం నలుగురు వ్యక్తులకే. శశాంక్ , ప్రొఫెసర్ చక్రపాణి, ఆర్మీ చీఫ్ జనరల్ కరియప్ప అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (IIAC) చైర్మన్ డాక్టర్. షణ్ముగం. వీళ్ళు నలుగురు ప్రతి నెల అతి రహస్యంగా కలుసుకుని రిసెర్చ్ ప్రొగ్రెస్స్ ని అనలైజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి పెట్టుకున్న కోడ్ నేమ్ “మాయ“

Saturday, January 30, 2010

అసుర సంధ్య పార్ట్ - 6

క్రిస్టినాతో వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా, లీ చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు. కొంచెం సేపటికి ఎటువంటి ప్రమాదం లేదు అని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా విగ్రహం ఉండవలసిన చోటికి వచ్చి వెతకసాగాడు. గ్రెగ్ కదిపిన రాయి తేలికగానే గుర్తుపట్టాడు. దాని పక్కనే ఏదో శాసనం లాంటిది కనిపించింది. అది తీసుకుని మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చి, “ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు. పదండి వెళ్లి పోదాం.” అన్నాడు. అందరు కలిసి బయటికి వచ్చేసారు. వస్తు వస్తూ, లీ, వివేక్ కొన్ని బంగారు గుండ్లు తీసుకు వచ్చారు. వాటి వంక చూస్తున్న జేమ్స్ తో “మనం అనుభవించిన దానికి ఎంతో కొంత ప్రతిఫలం తీసుకుని వెళ్దాం” అన్నాడు వివేక్. అందరు కలిసి గ్రెగ్ అంతకు ముందు దాచిన స్పీడ్ బోటు దగ్గరికి వచ్చారు. కొంతసేపట్లోనే సముద్రపు అలల మీదుగా దగ్గరలోని తీరానికి బయలుదేరారు.
*********
కొంత సేపటికి అమెరికా మరైన్స్ కి చెందిన ఒక బోటు కనిపించింది. వీళ్ళని తమ బోటు లోకి ఎక్కించుకొని మియామి వైపు బయలుదేరాయి. తరవాత కొన్ని రోజులు వీళ్ళకి చాల హడావిడిగ గడిచిపోయాయి. అమెరికన్ ఆర్మీ, నావి కలిసి వీళ్ళు చెప్పిన ఆనవాళ్ళ ప్రకారం ఆ గుహని స్వాధీనం చేసుకున్నాయి. అక్కడ గ్రెగ్ శవం తప్ప ఇంకేమి దొరకలేదు. నాయర్ బాడీ ని ఇండియా కి పంపించేసారు. ఇంటర్ పోల్ కి గ్రెగ్ ఆనవాళ్ళు పంపించారు. వాళ్ళకి కావాల్సిన వ్యక్తీ గ్రెగ్ అని నిర్ధారించుకుని గ్రెగ్ ఫైల్ క్లోజ్ చేసేసారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అర్కియాలజిస్ట్లు అందరు ఆ ద్వీపానికి బయలుదేరారు. అక్కడ ఉన్న బంగారాన్ని అమెరికన్ ప్రభుత్వం స్వాధీనం పరుచుకుని, క్రిస్టిన, లీ, జేమ్స్, స్వదేశాలకి , ఇండియా కి వాటాలు పంచింది. వివేక్ ఆలేఖ్య పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కొన్ని వారల పటు, వివేక్ ఆలేఖ్య అర్కేయలజి సేమినర్స్ ఇవ్వడంలో మునిగిపోయారు.

ఆరు నెలల తరవాత..........
వివేక్ ఆలేఖ్య కొంచెం తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో వివేక్ ఏదో గుర్తుకు వచినట్టు లేచి హడావిడిగా లోపలి వెళ్లి వెతకడం మొదలు పెట్టాడు. తనకి కావాల్సిన వస్తువు దొరికాక బయటికి వచ్చాడు. గుహలోంచి బయటికి వచ్చేటప్పుడు లీ తీసుకుని వచ్చిన శాసనం. వివేక్ ఆలేఖ్య దాని సంగతే మర్చిపోయారు. ఇద్దరు కూర్చుని చదవడం మొదలుపెట్టారు.


*********
క్రీస్తు శకం 700 మొదట్లో మాయ నాగరికత ఉచ్ఛ స్థితి లో ఉంది. యిక్’ఇన్ చన్ కే’అవియిల్ అనే రాజు తికల్ అనే రాజ్యాన్ని పాలించేవాడు. అతను పరాక్రమవంతుడు. అతని పాలనలోనే తికల్ రాజ్యం పెద్ద విపణిగ మారింది. సుదూర ప్రాంతాల నించి వర్తకులు తికల్ నగరానికి వచ్చి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగించేవారు. టోతిహుఅకాన్ (నేటి మెక్సికో దేశం లోని మెక్సికన్ వ్యాలి ) నించి కూడా వచ్చి వ్యాపారం చేసుకునేవాళ్ళు. కే’అవియిల్ పాలనలోనే తికల్ తన పొరుగున ఉన్న కాలక్ముల్ అనే రాజ్యాన్ని దాని మరో రెండు అనుబంధ రాజ్యాలని జయించింది. ఆ విజయానికి గుర్తుగానే యిక్’ఇన్ చన్ కే’అవియిల్ తికల్ పొలిమేరల్లో పెద్ద విజయ స్తూపం స్థాపించాడు. కలక్ముల్ రాజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అతని గురించి వెతికించి, అధరాలు దొరకక చనిపోయినట్టు ప్రకటించాడు. కొన్నాళ్ళకి అతని గురించి మర్చిపోయాడు. కానీ కలక్ముల్ని కోల్పోయిన యుక్నూం ఉత్తినే కూర్చోలేదు. ఎలాగో తప్పించుకుని ఈ ద్వీపానికి చేరుకున్నాడు. అక్కడి మంత్రికుడిని ఒప్పించి ఎన్నో క్షుద్ర శక్తులని తయారుచేయించాడు. ఒక రోజున ఆ క్షుద్రశాక్తులన్నితిని తికల్ రాజ్యం మీదకి ఉసిగొల్పాడు. ఆ రోజుతో తికల్ రాజ్యం అంతర్ధానం అయిపొయింది. తిరిగి వచ్చిన క్షుద్రశాక్తులని మాంత్రికుడు నిద్రాణపరిచి వాటిని నిబిరు అనే గ్రహం మీద నిక్షిప్తం చేసాడు. వాటిని తిరిగి మేల్కొపితే కేవలం అతని మాటకే కట్టుబడి ఉంటాయి. వాటిని తిరిగి రప్పించటానికి వీలుగా, ఇక్కడ ఒక క్షుద్రజీవిని తాయారు చేసాడు. ఈ క్షుద్రజీవి నిబిరు గ్రహం మీద ఉన్న మిగిలిన క్షుద్ర శక్తులని భూమికి రాప్పించాగలదు.
********
చదవడం అయిపోయాక వివేక్, ఆలేఖ్య మొహాలు చూసుకున్నారు. మాయ క్యాలెండర్ ప్రకారం 2012 భూమికి ఏదో పెద్ద ఉపద్రవం వస్తుంది అని ఉంది. ఆ విషయం మీద ఎన్నో పుకార్లు, సినిమాలు వచ్చాయి. అవి అన్ని కేవలం అభూత కల్పనలు అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రకటించాయి. ఇన్ని రోజులు వివేక్ ఆలేఖ్య కూడా అలానే అనుకున్నారు. ఉపద్రవం వస్తుంది అని మాయ శాసనాలు చాల వాటిలో ఉంది కానీ ఏ రూపంలో వస్తుందో ఎక్కడ సరిగ్గా చెప్పలేదు. ఆలేఖ్య భయంగ “వివేక్! అయితే మనం ఆ ఉపద్రవాన్ని ట్రిగ్గర్ చేసామ?” అని అడిగింది. దానికి సమాధానంగా ప్రకృతి వెంటనే స్పందించింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘవ్రుతమయిపోయింది. ఒక పెద్ద పిడుగు వీళ్ళు ఉన్న చోటికి కొంత దూరంలోని ఒక చెట్టు మీద పడింది. మరుక్షణం అక్కడ ఒక బూడిద కుప్ప తప్ప ఇంకేమి మిగలలేదు. ఆలేఖ్య కి ఆరు నెలల ముందు లండన్ నించి చికాగో ఫ్లైట్ లో తనకి వచ్చిన కల గుర్తుకువచింది.
-X-X-X-X-X-X-X-

Sunday, December 6, 2009

అసుర సంధ్య - 5

వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ పరిసరాలని గమనించడంలో మునిగిపోయారు. లీ, జేమ్స్ ఇద్దరికీ ఇంటరెస్టింగ్ గానే ఉన్న, అక్కడ వాళ్ళు ఎం చెయ్యడానికి లేక పోవడం తో కొంచెం ముందుకి వెళ్దామని బయలుదేరారు. వివేక్ ఆలేఖ్య కొంచెం సేపు అక్కడి పరిసరాలని చూసాక, అక్కడి బొమ్మలని పరిశీలించాక ఒక నిర్ధారణ కి వచ్చారు. అది ఒక ప్రయోగ శాల. అక్కడ ఆ దీవి సంరక్షకుడు అయిన మాంత్రికుడు రక రకాల ప్రయోగాలు చేసేవాడు. రకరకాల పొడులు, మూలికలు తాయారు చేసేవాడు. సాధారణంగా అవి వాడడం రాని వాళ్ళు వాడితే వికటిస్తాయి. అందుకని అలంటి వాటిని జాగ్రత్తగా మరో చోట దాచిపెడతారు. ఇది సాధారణంగా నేటి రీసెర్చ్ ల్యాబ్స్ లో కూడా అదే పధ్ధతి అనుసరిస్తారు. లాబ్లో తాయారు అయిన వాటిని ప్రత్యేకమైన వాల్ట్ లో పెడతారు. అక్కడికి చాల తక్కువ మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటిదే ఉంటుంది. జాగ్రత్తగా వెతికితే ఏంటో శక్తివంతమైన మిశ్రమాలు దొరికే అవకాశం ఉంది. వివేక్ ఆలేఖ్య అక్కడ చుట్టుపక్కల అంతా వెతికారు కానీ వాళ్ళకి అలంటి సదుపాయం ఏమి కనిపించలేదు. అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాలేచ్ట్ చేసుకున్నాక లీ జేమ్స్ ఎక్కడ ఉన్నారో అని బయలుదేరారు. వాళ్ళు బయలుదేరారో లేదో పెద్ద ఆర్తనాదం ఒకటి వినిపించింది. అది లీ గొంతులా ఉంది. వెంటనే వివేక్, ఆలేఖ్య ఇద్దరు ఆ అరుపు వినిపించిన వైపు పరుగెత్తారు. అక్కడికి కొంచెం ముందుకు వెళ్తే గోడలోకి తొలిచిన చిన్న కన్నం ఉంది. ఆ కన్నం కేవలం మూడు అడుగుల వెడల్పు అంటే పొడవులో ఉంది. లీ అరుపులు వినపడక పోతే ఆ కన్నాన్ని గమనించే వాళ్ళు కాదు. చెట్టు తోర్రలాంటి ఆ కన్నంలోంచి వివేక్ తల పెట్టి చూసాడు. లోపల లీ నెల మీద పడి దొర్లుతున్నాడు.నెమ్మదిగా వివేక ఆ కన్నంలోంచి అవతలికి దూరి జేమ్స్ దగ్గరికి వెళ్ళాడు. జేమ్స్ అప్పటికే లీ కి ఏమయ్యిందో పరిక్షుస్తున్నాడు. "లీ కి ఏమయింది జేమ్స్? ఎందుకలా పడిపోయాడు?"
"నేను, లీ నడుస్తుంటే లీ ఒక రాయి మీద చెయ్యి వెయ్యగానే ఈ తొర్ర ప్రత్యక్షమయింది. లీ నేను అతి కష్టం మీద లోపలకి వచము. నేను ఒక వైపు లీ ఒక వైపు గోడలని పరిక్షిస్తున్నాము ఇంతలొ ఏమయిందో ఏమో లీ ఉన్నట్టుండి గట్టిగ అరిచి పడిపోయాడు. బహుశ స్పృహలో లేడు అనుకుంటా. ఇతన్ని వెంటనే బయటకి తీసుకువెళ్ళాలి. ఫ్రెష్ ఎయిర్ చాల అవసరం. కొద్దిగా హెల్ప్ చెయ్యి." ఇద్దరు కస్టపడి ఎలాగో అలాగా లీ ని గుహ బయటకి తీసుకువచ్చారు. వెనకాలే ఆలేఖ్య కూడా వచ్చింది. గుహ బయటకి రాగానే, లీ మొహం చూడగానే జేమ్స్ కి అర్ధం అయ్యింది. లీ మొహం అంతా చీమలు కుట్టినట్టు ఎర్రగా కందిపోయి దద్దుర్లు దద్దుర్లు గ ఉంది. లీ అక్కడ గుహ లో ఉన్నప్పుడు ఏదో పురుగుని ముట్టుకున్నట్టు ఉన్నాడు. మొహం అంతా ఉబ్బిపోయి వికారంగా తయారయింది. వెంటనే జేమ్స్ చుట్టూ చూసి ఏవో పొద నించి కొన్ని ఆకులు తెంపి అరచేతులతో నూరి ఆ రసం లీ మొహం మీద పడేటట్టు గ పిండాడు. కొంచెం సేపటికి లీ కి మెలకువ వచ్చింది.అందరు ఆదుర్దా గ తననే చూస్తున్నారు."ఏమయింది ! అలా ఎందుకు అరిచావు? " అడిగాడు జేమ్స్. "నేను గోడలని తడుముతూ ఉండగా చిన్న అర లాంటిది చేతికి తగిలింది. అందులో ఏముందో అని వేలు కొంచెం లోపలి పెట్టగానే ఏదో గ్యాస్ లాగా వచ్చింది. తరవాత ఏమయ్యిందో నాకు తెలిదు" . "ఎస్. అక్కడ బంగారం కన్నా విలువ అయింది ఏదో ఉంది. అందుకే బంగారాన్ని గాలికి వదిలేసి దీన్ని మాత్రం చాల పకడ్బందీగా దాచిపెట్టారు." అన్నాడు వివేక. "మనం మొదట వెళ్ళిన గది ఒక లాబొరేటరి. అక్కడ రక రకాల ప్రయోగాలు చేసి ఉంటారు. ఆ కెమికల్స్ అన్ని ఎక్కడో దాచి ఉంటారు. బహుశ నీకు తగిలింది ఆ గదికి సంబంధించిన తాళం అయి ఉంటుంది. ఆ గది తెరవడం వల్ల మనుషులందరికీ పనికి వచ్చే ఎన్నో మందులు బయటపడొచ్చు." అంది ఆలేఖ్య. అందరు సాలోచనగా చూసారు. ఆలేఖ్య చెప్పింది నిజమే. కొన్ని ఆటవిక తెగలలో చనిపోయిన వారి తలకాయలని ఒక రకమైన ఆకు పసరులో నానబెట్టి దాన్ని నిప్పుల మీద కాల్చితే తలకాయ పిడికిలి సైజులోకి కుదించుకుపోతుంది. అలంటి తలలు చాల లభించాయి. ఆ ఆకు పసరు ఫార్ములా తెలుసుకో గలిగితే ట్యూమర్ తగ్గించడానికి అత్యంత బాధాకరమైన కేమో థెరపీ లేకుండానే తగ్గించవచ్చు. ఒక డాక్టర్ గ జేమ్స్ కి ఈ సంగతి తెలుసు. ఎన్నో నాగరికతల్ని చదివిన వివేక, ఆలేఖ్యలకి కూడా ఈ సంగతి తెలుసు. కాని వీళ్ళ అందరికి తట్టని విషయం ఇంకోటి ఉంది. విజ్ఞానం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. మంచికి ఉపయోగ పడినట్టే చెడుకి కూడా ఉపయోగ పడుతుంది. బహుశ ఆ సంగతి గ్రహించి బాధ పడ్డ మొదటి వ్యక్తీ ఐన్ స్టీన్ అనుకుంటా. ఆటం బాంబ్ కనిపెట్టడం వల్ల జరిగిన ప్రళయం చూసాక ఎంతో మానసిక వ్యధకి గురి అయ్యుంటాడు.

లీ కొద్దిగా తేరుకున్నాడు. మొహం మాములుగు అయ్యింది కాని ఇంకా క్నోచ్మే నలతగానే కనిపిస్తున్నాడు. లీ ని ఖాలీ ప్రదేశంలో కూర్చోబెట్టి జేమ్స్ వివేక్ ఏవో పళ్ళు తీసుకుని వచ్చారు తినటానికి. ఆలేఖ్య గుహ లో చూసిన సంఘటనల గురించి ఆలోచిస్తోంది. అందరు పళ్ళు తినేసాక, ఆల్కేహ్య చుట్టూ చూస్తె "గ్రెగ్ క్రిస్టినా వెళ్లి చాల సేపు అయ్యింది. ఇద్దరు ఏమి చేస్తున్నారో ఏమో?" అంది. జేమ్స్ భావ రహితంగా ఒక చూపు చూసి ఊరుకున్నాడు. అది గమనించి వివేక్ ఏదో అన బోయి ఆగిపోయాడు. ఆల్కేహ్య కి గుహలోకి వెళ్ళే ముందు జరిగినఆర్గుమెంట్ గుర్తు వచ్చింది.
"నాయర్ ఎలా చనిపోయాడో మనకి కొద్దిగా అర్థం అయ్యింది. కానీ మనం వెళ్ళిన చోటికి కాకుండా నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. లీ తో పటు మనం ఇద్దరం ఉండబట్టి సరిపోయింది లేక పోతే లీ ఆ కన్నం లోంచి బయట పడేవాడు కాదు. నాయర్ ని రక్షించడానికి ఎవ్వరు లేరు కనక నాయర్ కూడా అదే చోటికి వెళ్ళాడు అనుకోవడానికి లేదు. ఒక వేల లీ స్థానం లో నాయర్ ఉంది ఉంటె అక్కడికక్కడే చనిపోయేవాడు. నాయర్ తనంతట తను తిరిగి బయటకి నడుచుకుంట రాగలిగాడు అంటే నాయర్ వేరే చోటికి వెళ్లి ఉంటాడు. మనం ఎక్కువ రోజులు ఈ దీవిలో ఉండడం అంత మంచిది కాదు. రేపటి నించి ఈ గుహ దగ్గర కక్కుండా మనం సముద్రం దగ్గర ఎక్కువ సమయం గడుపుదాం. మనల్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకోసం ఎదురు చూడం తప్ప్ప ఇలా చావుని వెతుక్కుంటూ మనం వెళ్లొద్దు. టైం కలిసి వస్తే బంగారాన్ని అందర్మ తీసుకుని వెళ్ళొచ్చు." అన్నాడు జేమ్స్.
అది కరెక్ట్ అనిపించింది అందరికి. వీలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గ్రెగ్ క్రిస్టినా తిరిగి వచ్చారు. వాళ్ళని చూడగనే మిగిలిన వాళ్ళందరికీ ఏదో జరిగింది అని అర్థం అయ్యినిడ్. క్రిస్టినా మోహంలో ఏదో తెలియని ఆత్రుత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎం జరిగిందో అడుగుదామని ఆలేఖ్య నోరు తెరవబోతుంటే జేమ్స్ కళ్ళతోనే వారించాడు. గ్రెగ్ లీ ని చూడగానే “ఎం జరిగింది ! లీ అలా ఉన్నాడేమిటి?" అని అడిగాడు. వివేక్ జరిగింది చెప్పాడు. అంట విని గ్రెగ్ "మనకి తెలియని రహస్యాలు ఈ గుహ లో చాల ఉన్నట్టు ఉన్నాయి. మనం అంతా మరో సారి ఆ గుహలోకి వెళ్ళడం మంచిదేమో. మన ఎవరికీ తెలియని ఎన్నో రహస్యాలు తెలుసుకోవచ్చు” అన్నాడు గ్రెగ్. అంతా అతని వంక విచిత్రంగా చూసారు. కేవలం కొన్ని గంటల ముందు అనవసరంగా మన ప్రాణాలు రిస్క్ చెయ్యడం ఎందుకు అని అడిగిన మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాదేమిత అని అందరికన్నా మొదట అనుమానం వచ్చింది జేమ్స్ కి. వయసు నేర్పిన అనుభవం వల్ల జేమ్స్ అప్పుడేమి మాట్లాడలేదు. మాట్లాడి ఉంటె అక్కడ గ్రెగ్ చేతిలో ఎన్ని ప్రాణాలు పోయేవో?
జేమ్స్ అంతరంగంలో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతున్నాయి. కొన్ని గంటల ముందు మాట్లాడినదానికి పూర్తీ విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. అంటే అప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఏదో మారింది. గ్రెగ్ క్రిస్టినా ఇద్దరు తిరిగి వచినప్పటి నించి క్రిస్టినా అదోలా ఉంది. ఎందుకో మాటిమాటికి గ్రెగ్ ని వెతుక్కుంటోంది. ఎక్కడికో వదిలి వెళ్ళిపోతాడు అన్న భావన కనిపిస్తోంది తన కళ్ళలో. చుట్టూ సముద్రం తప్ప ఏమి లేని దీవిలోంచి తప్పించుకోవాలి అంటే రెండే రెండు మార్గాలు. ఒకటి ఈదుకుంటూ వెళ్ళడం. రెండు ఏదన్న పడవ ఎక్కి వెళ్ళడం. మొదటిది అసంభవం కనక గ్రెగ్ కి ఏదన్న పడవ దొరికిందా? అయితే ఆ సంగతి అందరికి చెప్పలేదేందుకు?
సమాధానం తెలియని ఈ ప్రశ్నలనించి మనసుని డైవర్ట్ చెయ్యడానికి తల గట్టిగ విదిలించాడు జేమ్స్. అప్పటికి గాని గ్రెగ్ తననే అబ్జర్వ్ చేస్తున్న సంగతి గమనించలేదు. గమనించగానే జేమ్స్ వళ్ళు జలదరించింది. ఆ చూపులు కుందేలు మీద పంజా విసిరే సింహం చూపులా చాల నిర్లిప్తంగా ఉంది.

ఆ తరవాత చాల సేపటికి గాని జేమ్స్ ఆ చూపులని మర్చిపోలేకపోయాడు. ఆ రాత్రి అంతా కూడా జేమ్స్ కి నిద్ర పట్టలేదు. ఏ చిన్న చప్పుడు అయిన చటుక్కున లేచి కూర్చుంటున్నాడు. అలా కొంత సేపు అయ్యాక, జేమ్స్ ఇంక ఉండబట్టలేక, చల్ల గాలికి తిరిగితే అయినా కొంచెం నిద్ర పడుతుందేమో అన్న ఆలోచనతో లేచి ఇవతలికి వచ్చాడు. అలా వస్తుండగా గుహలోంచి వినిపించింది ఒక పెద్ద అరుపు. ఆ అరుపు మాములుగా లేదు. ఏదో అడవి జంతువు ఆకలితో అలమటిస్తున్న అరుపుల ఉంది. వాళ్ళు ఆ దీవిమీదకి వచ్చి అప్పటికే సుమారుగా వారం అయిఉంటుంది. వాళ్లకి ఎక్కడ పెద్ద జంతువులు కనిపించలేదు. ఆ అరుపు చాల వికృతంగా ఉంది. జేమ్స్ కి తెలిసినంత వరకు అటువంటి అరుపు ఎప్పుడు విని ఉండలేదు. ఆ అరుపుకి మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా లేచి వచ్చారు.
లీ వస్తూనే "గ్రెగ్, క్రిస్టినా ఏరి?" అని అడిగాడు.
అప్పటి వరకు అక్కడ గ్రెగ్, క్రిస్టినా లేరు అన్న సంగతి జేమ్స్ కి గాని, ఆలేఖ్య వివేక్ కి కానీ స్ఫురించలేదు. ఇంతలో గుహలోంచి మళ్ళి ఆ అరుపు వినిపించింది. ఆ అరుపు వెనకే మరో గొంతు వినిపించింది.
"అది క్రిస్టినా గొంతు" అంది ఆలేఖ్య.
వెంటనే గుహ లోకి లీ, వివేక్ సంధించి వదిలిన బాణంలా పరుగు తీసారు. వెళ్తూ వెళ్తూ లీ రెండు ఎండు కొమ్మలు విరిచి వివేక్ కి ఒకటి ఇచ్చి తను ఒకటి పట్టుకున్నాడు. వెనకాలే జేమ్స్, ఆలేఖ్య అందుబాటులో ఉన్న రాళ్ళు తీసుకుని పరిగెత్తారు. గుహలోకి వెళ్ళాక అరుపులు మరింత ఎక్కువ అవ్వసాగాయి. నలుగురు అరుపులు వినిపిస్తున్న దిశలోకి పరుగెత్తారు. ఆ దారి మలుపులు తిరుగుతూ వీళ్ళు కూడా పరుగు తీసారు. ఒక మలుపులో ఉన్న రాయిని తప్పించుకోబోయి లీ బోర్ల పడిపోయాడు. ఆ వెనకాలే వస్తున్నా వివేక్ లీ ని లేపుదామని కిందకి వంగినవాడు అలానే స్థాణువులా ఉండిపోయాడు. కొంచెం ఆలస్యంగా అక్కడికి వచ్చిన ఆలేఖ్య, జేమ్స్ కూడా వివేక్ చూస్తున్న వైపు చూసి ఎక్కడి వాళ్ళు అక్కడే బిగుసుకుపోయారు. అక్కడ ఏముందా అనుకుంటూ అటు వైపు చూసిన లీ తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అక్కడ సుమారుగా పది అడుగుల ఎత్తు ఉన్న జంతువు ఏదో ఉంది. మొసలిని పోలిన ఆ జంతువు ఒళ్ళంతా పొలుసులు పొలుసులుగ ఉంది. వీపు మీద అర చెయ్యి అంతా మొప్పులు తల నించి నడుము దాక ఉన్నాయి. ఆ జంతువు కోరలు పది అంగుళాల పొడవు ఉన్నాయి. నోటి నించి లాలాజలం కారుతూ చూడడానికి చాల అసహ్యంగ భయంకరంగా ఉంది. ఆ జంతువు తన ఎర్రటి కళ్ళతో ఎదురుగ ఉన్న క్రిస్టినా వంకే చూస్తుంది. రక్తం ఓడుతున్న చేతులతో క్రిస్టినాని పట్టుకోవడానికి విఫలయత్నం చేస్తోంది. ఆ దృశ్యం చూడగానే నలుగురు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో ఆ జంతువు మీద ఎదురుదాడి ప్రారంభించారు. అప్పటి దాక క్రిస్టినా మీద దాడి చేస్తున్న ఆ జంతువు సడెన్గా ఎదురయిన ప్రతిఘటనకి బిత్తరపోయింది. క్రిస్టినాని పట్టుకునే ప్రయత్నం విరమించుకుని గుహ లోపలి పరుగెత్తుకుంటూ అక్కడున్న చీకటి సందుల్లో దూరి మాయం అయిపొయింది.
"ఏమయ్యింది? ఇంత రాత్రి పూట ఇక్కడికి ఎందుకు వచ్చావ్? అసలు ఆ జంతువు ఏంటి? ఎక్కడి నించి వచ్చింది?" అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది ఆలేఖ్య. ఇంక భయంతో బిగుసుకుపోయిన క్రిస్టినా ని నెమ్మదిగా బయటికి తీసుకు వచ్చారు. బయటికి వచ్చిన కొంత సేపటికి క్రిస్టినా షాక్ నించి తేరుకుంది. నెమ్మదిగా ఆ రోజు మధ్యాహ్నం నించి జరిగిన సంగతులు చెప్పడం మొదలు పెట్టింది:

పడవని పొదల మాటున దాచేసి చేతులు దులుపుకుంటూ ఇవతలికి వచ్చాడు గ్రెగ్. అదంతా అవ్వడానికి సుమారుగా అరగంట పైనే పట్టింది. గ్రెగ్ చంపి సముద్రంలో విసిరేసిన శవాల జాడ కనిపెట్టినట్టున్నాయి చేపల మీద బతికే కొన్ని సముద్రపు పక్షులు. నెమ్మదిగా గుంపులు గుంపులుగా శవాల మీద వాలి దొరికినంత ముక్క ముక్కున కరుచుకుని గూటిలో ఉన్న పిల్లలకి ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాయి. వాటినే చూస్తున్న క్రిస్టినా కి మాంసపు ముద్దలా మీద వాలుతున్న ఆ పక్షులకి మనుషులకి పెద్ద తేడా కనిపించలేదు. మనిషి కూడా అంతే. దొరికిన వాటిని దొరికినట్టు తన పరివారానికి మొత్తం అందేలా దాచేస్తాడు. కాకపోతే ఇక్కడ మనుషులకి పక్షులకి కొంచెం తేడా ఉంది. మనిషి తన స్వార్ధానికి తోటి మనిషిని చంపి అయినా తను లాభం పొందుతాడు. పక్షులు అలా కాదు. కనీసం తమ జాతి పక్షులని స్వార్థానికి చంపవు. ఇలా సాగుతున్నాయి క్రిస్టినా ఆలోచనలు. ఇంతలో గ్రెగ్ వస్తున్న అలికిడికి అటు వైపు తిరిగింది.
"ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావ్?" అన్నాడు.
"ఇంతకీ పడవని ఎందుకు దాచేసావ్? అందరం కలిసి వెళ్లిపోవచ్చు కదా!" అంది.
"ఆ పడవ బయట అలానే ఉంచేస్తే వీళ్ళని వెతుక్కుంటూ వచ్చేవాళ్ళకి ఈజీగా దొరికిపోతాం. అప్పుడు వాళ్ళు మనకి పోటి వస్తారు. బంగారం లో మనకి వచ్చే షేర్ తగ్గిపోతుంది" అన్నాడు.
"నీ ప్లాన్ ఏంటి? అంత బంగారాన్ని ఎప్పుడు ఎలా తీసుకువద్దాం?" అడిగింది క్రిస్టినా.
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు. అందరు పడుకున్నప్పుడు నెమ్మదిగా మనం ఇద్దరం గుహ లోకి వెళ్లి నెమ్మది నెమ్మది గా మోయ్యగలిగినన్ని తీసుకుని వచ్చేద్దాం. ఈరోజు మనం చెయ్యాల్సిన పనులు చాల ఉన్నాయి. పద! అడివిలోకి వెళ్లి మనకి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుందాం" అన్నాడు.
వడివడిగా అడుగులు వేసుకుంటూ సముద్రపు ఒడ్డున పడి ఉన్న సామాన్లలోంచి కొంచెం పెద్దగ, బలంగా ఉన్న సూట్ కేస్లు రెండు పట్టుకు వచ్చాడు. అలానే అడివిలోకి వెళ్లి బలంగా ఉన్న రెండు మూడు కొమ్మలని విరిచి, వాటి మొదల్లని పదునుగా చెక్కాడు. అవి ఈటేల్లాగా ఉన్నాయి.
వాటిని చూడగానే క్రిస్టినా భయంగా "అవి ఎందుకు. మనం బంగారం మోసుకు రావడానికి సూట్ కేస్లు ఉన్నాయి కదా. మళ్ళి ఇవి ఎందుకు?"
క్రిస్టినా ప్రశ్న కి బదులు చెప్పకుండా, గ్రెగ్ ఆ సూట్ కేస్లని మిగలిన వాళ్ళ కంట బడకుండా గుహ దగ్గరికి చేర్చాడు. చేర్చి ఇద్దరు కలిసి మిగలిన వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు.
గ్రెగ్ కి మిగలిన వాళ్లకి వాటా ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే లీ కి జరిగిన సంఘటనని తనకి అనుకూలంగా మార్చుకుందామని ప్రయత్నించాడు. అందరిని గుహ లోకి వెళ్దాము అని ప్రోత్సహించాడు.
లీ కి జరిగినట్టే మిగిలిన వాళ్ళకి కూడా ఏదన్న ప్రమాదం జరిగి వాళ్ళంతట వాళ్ళు చనిపోతారేమో అనుకున్నాడు. కాక పోతే జేమ్స్ ప్రవర్తనలో ఏదో మార్పు గమనించి ఆగిపోయాడు.
అందరు పడుకున్నాక, గ్రెగ్ క్రిస్టినాని నెమ్మదిగా తట్టి లేపాడు. ఇద్దరు కలిసి నెమ్మదిగా గుహలోకి వెళ్లారు. బంగారం ఉన్న చోటికి వెళ్తుండగా గ్రెగ్ కి ఏదో అలికిడి వినిపించి అటు వైపు కాకుండా మరో వైపు దారి తీసాడు.
అలా కొంచెం ముందుకి వెళ్ళాక, అక్కడ కొన్ని విగ్రహాలు కనిపించాయి. వాటిలోంచి శబ్దాలు వస్తున్నాయి.
క్రిస్టినా కొంచెం భయం భయం గా "గ్రెగ్! మనం వెల్లిపోదాం. నాకెందుకో భయంగా ఉంది. విగ్రహాలలోంచి శబ్దాలు వస్తున్నాయి. ప్లీజ్ నా మాట విను వెళ్లి పోదాం" అంది
"అదేం లేదు నువ్వు ధైర్యంగా ఉండు. బహుశ ఇది మనం మొదటి రోజు నించి వింటున్న శబ్దాలేమో. గాలి చేస్తున్న శబ్దాలు అని భ్రమించాం. ఈ సంగతేంటో తెల్చేస్తాను చూడు " అన్నాడు.
ఆ విగ్రహాన్ని పరీక్షిస్తూ విగ్రహం పక్కన ఉన్న ఒక రాయిని కదిపాడు. ఆ రాయి కదలడం, విగ్రహం ప్రాణమున్న జంతువుల మారడం ఒకేసారి జరిగాయి. ఆ జంతువు ప్రాణం రాగానే, తనకి అతి సమీపం లో ఉన్న గ్రెగ్ తలని ఒక చేత్తో, భుజాలని ఒక చేత్తో పట్టుకుని తలని ఒక్క ఊపులో మెడ నించి వేరు చేసేసింది. జరిగింది ఏమిటో క్రిస్టినా కి అర్థం అయ్యేలోపు గ్రెగ్ మొండాన్ని విసిరేసి క్రిస్టినా మీదకి వచ్చేసింది. దాని బారి నించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా జేమ్స్, వివేక్, లీ, ఆలేఖ్య వచ్చి క్రిస్టినా నికాపాడారు.

అసుర సంధ్య - 4

ఆ ఆలోచనలతోటే ఆ రాత్రి గడిచిపోయింది. ఎవ్వరికి నిద్ర సరిగ్గా పట్టలేదు. పొద్దున్న అవుతూనే, వివేక్ ఆలేఖ్య ఇద్దరు గుహలోకి బయలుదేరారు. తమతో పాటు వచ్చిన నాయర్ చనిపోవడం ఇద్దరు చాల సీరియస్ గా తీసుకున్నారు. ఎత్తి పరిస్థితులలోను నాయర్ చావుకి కారణం తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఇద్దరు గుహలోపలికి వెళ్తుంటే గ్రెగ్ అభ్యంతరం చెప్పాడు. "నిన్ననే నాయర్ని కోల్పోయాం. మళ్ళి మీ ఇద్దరినీ కూడా కోల్పోదల్చుకోలేదు. లోపల నాయర్ ఎందుకు అటు వెళ్ళాడో, ఎందుకు చంపబడ్డాడో మనం తెలుసుకోకుండా మళ్ళి ఆ గుహలోకి వెళ్ళడం అంత మంచిది కాదు." "మేము బంగారం కోసమే ఆ గుహలోకి వెళ్తున్నమనుకుంటే మీరు పొరబడ్డారు. మీకు నాయర్ నాలుగు రోజుల నించి తెలుసు. కాని మాకు ఇద్దరికీ ఆయన నాలుగు సంవత్సరాలుగా తెలుసు. మీకు ఆ గుహలో బంగారం మాత్రమే కనిపిస్తుంది. కాని మా ఇద్దరికీ నాయర్ చావుకి కారణం కనిపిస్తోంది. దానికి మించి మాయా నాగరికత గురించిన విలువయిన సమాచారం ఉంది. మీరు ఒక డాక్టర్.ఒక పేషెంట్ చావు బతుకుల మధ్య ఉంటె చూస్తూ మీరు ఎలా ఊరుకోలేరో ఒక ఆర్కియాలోజికల్ సైట్ ని గాలికి వదిలి మేము ఇద్దరం ఉండలేము. ఇది మా వ్రుత్తి. దానికి మించి మా గురువులాంటి వ్యక్తీ చావుకి కారణం తెలుసుకోవడం మా బాధ్యత" ఆవేశం గ అంది ఆలేఖ్య. తన మాటలు విని జేమ్స్ కూడా వాళ్ళనే సపోర్ట్ చేసాడు. గ్రెగ్, క్రిస్టినా తప్ప అందరు మిగిలిన వాళ్ళు అందరు గుహ లోకి వెళ్లారు. "హౌ ఫూలిష్? చనిపోయిన వ్యక్తి కోసం వీళ్ళ ప్రాణాలు రిస్క్ లో పడేసుకుంటున్నారు. ఒక్క సారి ఈ దీవి లోంచి బయటపడని. నేను ఈ దివికి సేపెరేట్ గ వచ్చి ఈ బంగారాన్ని అంత తీసుకుపోతాను. నువ్వు నేను జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు." అంటు క్రిస్టినా ని కౌగిలిన్చుకున్నాడు. గుహ లోకి వెళ్ళిన లీ, జేమ్స్, వివేక్, ఆలేఖ్య బృందం, వధ్యశాల దాటి ఇంకా ముందుకు వెళ్లారు. వాళ్ళు గుహ లోపలి ఒకట్రెండు కిలోమీటర్లు నడిచి ఉంటారు. అంత దూరం నడిచినా, వాళ్ళకి ఇంకా గుహ అవతలి భాగం కనిపించట్లేదు. కొంచెం ముందుకి వెళ్ళేటప్పటికి గుహ నెలకి సమాంతరంగా కాకుండా నేల లోపలి దిగడం ప్రారంభించింది. వాళ్లకి కుడి వైపున రెండు పెద్ద మందిరాలు కనిపించాయి. ఇన్నాళ్ళు వాళ్ళు ఆ గుహ సహజంగా ఏర్పడిందేమో అనుకున్నారు. కానీ గుహ అంత ఒక పధ్ధతి ప్రకారం కొండని తోలిచినట్టుగా ఉంది. ఆ మందిరం గోడల నిండా రకరకాల బొమ్మలు, మాయ లిపిలో ఏవో శాసనాలు రాసి ఉన్నాయి. వివేక్, ఆలేఖ్య ఆ శాసనాలు చదవడం మొదలు పెట్టారు. వాళ్ళకి అది చాల తేలికగా అనిపించింది. మాయ నాగరికత మిగలిన నాగరికతలకన్న ప్రపంచానికి ఎక్కువ తెలుసు. ఆ శాసనాలు చదువుతున్న కొద్ది వాళ్ళ మొహం లో రంగులు మారడం మొదలయ్యింది. ఆ శాసనం ప్రకారం, ఆ దీవి ఒక క్షుద్రోపాసకుడి ఆధీనంలో ఉండేది. మాయ నాగరికత టైం లో ప్రజలు చిన్న చిన్న గుంపులు గ ఉండేవారు. ఒక తెగకి ఇంకో తెగకి పడేది కాదు. ఆధిపత్య పోరు చాల భీకరంగా ఉండేది. ఒక రాజ్యపు సైన్యం మరో రాజ్యపు ప్రజలని దారుణంగా ఊచకోతకోసి, వారి సంపదనంతా దోచుకునే వారు. శత్రువుల నించి రాజ్యాన్ని రాజ్యపు సంపదని కాపాడుకోవడానికి రాజులు ఈ మాంత్రికుడి దగ్గర తమ సంపదనంతా దాచి ఉంచారు. ఈ మాంత్రికుడు అత్యంత శక్తి యుక్తులు కల వాడు. ఇతని ఆధీనంలో ఎన్నో క్షుద్ర శక్తులు ఉండేవి. ఆ క్షుద్ర శక్తుల సాయంతో ఆ దీవిని ఆ మాంత్రికుడు కాపాడుకునే వాడు. వీరి సంపదని కాపాడుతున్నందుకు ప్రతిగా మంత్రికుడికి కావాల్సిన అన్ని అవసరాలు తీర్చేవాళ్ళు మాయ రాజులు. మాంత్రికుడి ప్రయోగాలకి కావాల్సిన వస్తువులు, జంతువులు, మనుషులు అన్ని సమకూర్చేవారు. ఇప్పుడు వీళ్ళు నిలబడ్డ మందిరం, ఆ మాంత్రికుడి ప్రయోగ శాల. ఇది చదవగానే బంగారం, ఇతర విలువయిన వస్తువులు ముందు గదుల్లో అన్ని రాసులుగా ఎందుకున్నాయో అర్థం అయ్యింది. అప్పట్లోనే ఇలాంటి విధానం ఉందా అని ఆశ్చర్య పోయారు. నేటి ఆధునిక యుగంలో ప్రతి దేశం తన దగ్గర ఉన్న బంగారాన్ని ఒక చోట దాచి పెడుతుంది. ఆ నిల్వల్ని బట్టి ఆ దేశ పురోగతి ఆధార పడి ఉంటుంది. ప్రపచంలో అత్యంత ఆకర్షకరమైన దేశం అమెరికా తన బంగారు నిల్వల్ని ఫోర్ట్ నోక్స్ లో దాచి పెడుతుంది. ప్రతి దేశపు మారక విలువ ఆ దేశం వద్ద ఉన్న బంగారు నిల్వల్ని బట్టి నిర్ణయిస్తారు. ఆ శాసనాన్ని బట్టి ఈ దీవికి సమీపం లో మరిన్ని దీవులు కాని, దగ్గరలోనే నేల గాని ఉండి తీరాలి.

సముద్రంలో అలలతో పోటిపడుతూ ఒక మధ్య రకం స్పీడ్ బోటు వేగంగా దూసుకుపోతోంది. అది యు.ఎస్ నావికాదళానికి చెందినది. సరిహద్దు పహారా కాయడం దాని ప్రధాన కర్తవ్యమ్. నాలుగు రోజులనించి సముద్రం లో కూలిన శకలాల కోసం వెతుకుతున్నారు. అప్పటికే విమానం కూలి వారం దాటిపోయింది. విమానం ఎక్కడ మిస్ అయ్యిందో తెలీకపోవడం,వాతావరణం అనుకూలించకపోవడంతో శకలాల వెలికితీత చాల ఆలస్యమయింది. విమానం కూలినప్పుడు తుఫాను తీవ్రంగా ఉండడం, విమానం కూలి వారం అవ్వడం వాళ్ళ, శకలాలు చాల పెద్ద విస్తీర్ణంలో చెల్లా చెదురుగా ఉన్నాయి. సముద్రం లో అంతర్వాహినులు ఉంటాయి. పైకి తెలియని ప్రవాహాలు అవి. వాటిలో చిక్కుకుంటే మీడియం సైజు పడవలు కంట్రోల్ తప్పుతాయి. ఒక్కోసారి నావికులు ఈ అంతర్వాహినుల గమనాన్ని బట్టి ఓడ డైరెక్షన్ మార్చి లాభ పడుతుంటారు. ఎంతో అనుభవం ఉన్నవాళ్ళకి తప్ప మామూలు కంటికి కనిపించవు.అలల తాకిడికి, తుఫాను భీభత్సానికి శకలాలు చెల్లా చెదురు అయిపోయాయి. ప్రయాణీకుల శవాలు సముద్ర ప్రాణులకి ఆహరం అయిపోయాయి. విమానం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. మొత్తం ఎనిమిది బృందాలు బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నాయి. ఎవరైనా బతికి ఉంటారన్న ఆశ లేదు. కనీసం శవాలు అయిన దొరుకుతాయేమో అని వెతుకుతున్నారు. ఇద్దరు సిబ్బంది ఉన్న బోటులో సముద్రంలో చాలా లోపలకి వచ్చారు. సముద్రాన్ని గ్రిడ్ కింద విభజించి రోజు కొంత ప్రాంతాన్ని వెతుకుతున్నారు. చీకటి పడేటప్పటికి వెతుకులాట ఆపేస్తున్నారు. వెతికి వెతికి సిబ్బందికి కూడా విసుగు పుట్టింది. చేసే పని మీద శ్రద్ధ తగ్గింది. ఆటవిడుపుకోసం చేపల వేట మొదలుపెట్టారు. అలా అలా వెతుకుతూ ఉండగా దూరంగా వాళ్ళకి ఒక దీవి కనిపించిది. వాళ్ళదగ్గర ఉన్న మాప్ ప్రకారం అక్కడ ఎటువంటి దీవి లేదు. ఆ దీవిని చూడగానే బోటు నడుపుతున్న జో ఆశ్చర్యం తో విజిల్ వేసాడు. దీవి కనిపించిన సంగతి బేస్ స్టేషన్ కి రిపోర్ట్ చేద్దాం అని వైర్లెస్ సెట్ ఆన్ చేసాడు. గరగర శబ్దం తప్ప సిగ్నల్ రాలేదు. అక్కడ శాటిలైట్ కవరేజ్ లేదు అని అర్థం అవ్వడానికి ఎక్కువ సేపు పట్టలేదు. బహుశ అందుకే ఈ దీవి కూడా మ్యాప్ లో లేదు ఏమో. నెమ్మదిగా దీవి దగ్గరికి పోనిచ్చాడు.
అందరు గుహ లోపలి వెళ్ళగానే క్రిస్టినా, గ్రెగ్ అడవిలో విహారానికి బయలుదేరారు. ఆలా తిరుగుతూ తిరుగుతూ సముద్రం దగ్గరగా వచ్చారు. నడుస్తున్నదల్ల ఉన్నట్టుండి ఆగిపోయింది. "గ్రెగ్ ! నీకు ఏదయినా శబ్దం వినిపిస్తోందా? " అప్పటికే గ్రెగ్ కూడా బోటు శబ్దం విన్నాడు. ఇద్దరు ఒకరి వంక ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంగా ఆనందంగా శబ్దం వినిపిస్తున్న వైపు పరిగెత్తారు. ఇద్దరు సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి బోటు అప్పుడే ఆగింది. అందులోంచి ఇద్దరు వ్యక్తులు కిందకి దిగితున్నారు. పరుగెడుతున్న గ్రెగ్ క్రిస్టినా ని కూడా ఆపి ఇద్దరు ఒక పొద చాటున దాక్కున్నారు. "హే! ఎం చేస్తున్నావ్? ఎందుకు ఆపేసావ్? బోటు వచ్చింది కదా, అందులోకి అందరం ఎక్కి హ్యాపీగా ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్లిపోవచ్చు కదా. ఈ బంగారం కూడా ఎవరికీ కావలసినంత వాళ్ళం తీసుకుని మిగిలిన లైఫ్ అంతా ఏ లోటు లేకుండా గడపొచ్చు."
"పిచ్చిదానా! ఎవరికి కావలసినంత బంగారం వాళ్ళు కాదు, మనకి కావల్సినంత మనం మాత్రమే తీసుకుందాం. మిగిలిన వాళ్ళని ఈ దీవి మీద వదిలేసి మనం వెళ్లిపోదాం."
“మనం బంగారం తీసుకుని వెళ్తే వీళ్ళు వాటా అడుగుతారు కదా. వాళ్ళు మనల్ని ఎమన్నా చేస్తే? "
"వాళ్ళు బతికుంటే కదా మనల్ని ఎమన్నా చేసేది? “ అంటూ బట్టల చాటు నించి ఒక చిన్న కత్తి తీసాడు. అది విమానంలో సలాడ్స్ కట్ చేయడానికి వాడే కత్తి. ఒడ్డుకు కొట్టుకు వచ్చిన సామాన్లలో దొరికింది అది. ఎందుకన్నా పనికి వస్తుంది అని తీసి ఎవరికి కనిపించకుండా దాచి పెట్టాడు. కత్తి వంక కంగారుగా చూస్తూ
"ఎం చేయ్యబోతున్నావ్ దీనితో?" అంది క్రిస్టినా.
"వెయిట్ అండ్ సి" అంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ బోటు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే బోటు లోంచి దిగి ఇద్దరు తలో వైపు నడుస్తున్నారు. గ్రెగ్ నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరి వెనకగా వెళ్లి ఇద్దరి గొంతు అతి చాకచక్యంగా కోసేసాడు. గ్రెగ్ పనితనం చూసి క్రిస్టినాకి అనుమానం వచ్చింది. అప్పటి దాక ఏదో సరదాగా మాట్లాడుకోవడమే తప్ప గ్రెగ్ గురించి అసలు తనకి ఏమి తెలిదు అని గ్రహించింది. ఈలోపు గ్రెగ్ బోటు ని వడ్డుకి దగ్గరగా పొదల్లోకి లాగి ఆకులు కొమ్మలతో కప్పెసాడు. పడవ లాగిన జాడలు కనిపించకుండా ఇసకని సరిచేసాడు. అప్పటికే శవాలుగ మారిన ఇద్దరినీ సముద్రంలో చేపలకి ఆహారంగా పడేసాడు. గ్రెగ్ తిరిగి రాగానే క్రిస్టినా అడిగింది "ఎవరు నువ్వు?". గ్రెగ్ ఒక పెద్ద హిట్ మాన్. యూరోప్, అమెరికాలలో జరిగిన ఎన్నో రాజకీయ హత్యలు గ్రెగ్ చేతుల మీదుగా జరిగినవే. గ్రెగ్ ఎవరో ఏమిటో ఎవరికి తెలిదు. తనని చూసిన వాళ్ళెవరూ బతకలేదు. తనతో లావాదేవీలు అన్ని అప్పటికప్పుడు ఏర్పరుచుకునే సంకేతాల ద్వార, కోడ్స్ ద్వార జరుగుతాయి తప్ప డైరెక్ట్ గ జరగవు. తను చేసే హత్యలు అన్ని హై ప్రొఫైల్ హత్యలు అవ్వడం వల్ల ఎప్పుడు బహిరంగంగా తిరిగే అవకాసం రాలేదు. ఎలాగు ఈ ఫ్లైట్ క్రాష్ లో తను చనిపోయినట్టు ప్రచారం అయింది కనక ఒక వేళ తిరిగి వెనక్కి వెళ్ళడం అంటూ జరిగితే కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నాడు. క్రిస్టినా కూడా ఆ నిర్ణయానికి ఒక కారణం. అదంతా క్రిస్టినా కి చెప్పదల్చుకోలేదు.
"నా గతం తెలియడం వల్ల నీకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎప్పుడు దాని గురించి ఆలోచించకు. ఇక్కడ నించి ఈ రాత్రికే బయటపడి, కొత్త జీవితం మొదలుపెడదాం. చెప్పు ప్రపంచంలో నీకు ఎక్కడ సెటిల్ అవ్వాలని ఉంది? మనం అక్కడే మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాం." అన్నాడు గ్రెగ్. "ఈ రాత్రికా? మరి వీళ్ళందరూ?"
"వీళ్ళని చంపడం నాకు ఇష్టం లేదు.ఎంతన్న జేమ్స్ నన్ను కాపాడాడు. మనం మనకి కావల్సినంత బంగారం ఈ పడవలోకి చేరవేసి ఈ దీవి నించి తప్పించుకుందాం. వీళ్ళ అదృష్టం బావుంటే బయటపడతారు. లేక పొతే వీళ్ళ ఖర్మ. " అన్నాడు గ్రెగ్.
ఆ క్షణంలో గ్రెగ్ ని చూస్తె ఒక విదమైన భయం వేసింది క్రిస్టినా కి. కానీ అదే సమయంలో అతని మీద ప్రేమ ఆ భయాన్ని మింగేసింది.